విశాఖ

ప్రశాంతంగా ఆర్‌ఇసిఎస్ పాలిటెక్నిక్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, జూన్ 9: స్థానిక ఆర్‌ఇసిఎస్ కార్యాలయ ఆవరణలో ఉన్న రాజీవ్‌గాంధీ ఆర్‌ఇసిఎస్ పాలిటెక్నిక్‌లో గురువారం జరిగిన కౌనె్సలింగ్ ప్రశాంతంగా జరిగింది. మెకానికల్, ఇఇఇ, ఇసిఇ, సివిల్ బ్రాంచ్‌లున్న ఈ కళాశాలలో 120 సీట్లకు 362 దరఖాస్తులు వచ్చాయి. కౌనె్సలింగ్ సందర్భంగా 310 మంది విద్యార్థులు రావడంతో వీరిలో 120 మందిని ఎంపిక చేశారు. కౌనె్సలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ అనకాపల్లి నుండి బికె సూర్యప్రకాష్, సహాయకునిగా ప్రభుత్వపాలిటెక్నిక్ ఆధ్యాపకుడు ఎ.నాగరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్ మాట్లాడుతూ మెకానికల్ బ్రాంచ్‌కు ఎక్కువశా త ం విద్యార్థులు మొగ్గుచూపారని, దీంతో 19000 ర్యాంక్ వచ్చేసరికే సీట్లు పూర్త య్యాయన్నారు. ప్రశాంతంగా కౌనె్సలింగ్ పూర్తయ్యేందుకు వచ్చిన వారంతా సహకరించారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కె.శివ, హెచ్‌ఓడిలు ఎస్.గణేష్, బి.కీర్తి, ఆఫీసు సూపరింటెండెంట్ కె.శివరాం ఆధ్యాపకులు పాల్గొన్నారు.