విశాఖ
ప్రొ-క్యారమ్స్ లోగో ఆవిష్కరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాఖపట్నం (స్పోర్ట్స్), జూన్ 10: అఖిల భారత క్యారమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ప్రొ క్యారమ్స్ లీగ్ లోగోను మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ లీగ్లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను ఆక్షన్ద్వారా ఆరు జట్లను ఎంపిక చేసుకున్నాయి. ఇప్పటికే అయిదు జట్ల ఎంపిక జరిగిపోయింది. ఇంకా మిగిలిన ఒక జట్టు యుఎస్కు సంబంధించినది కాగా దానిని కూడా భారతీయులే స్పాన్సర్ చేస్తున్నారని సమాఖ్య అధ్యక్షుడు నీరజ్కుమార్ సంపత్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ప్రతి జట్టులో ఐదుగురు క్రీడాకారులు, కోచ్, మేనేజర్ ఉంటారన్నారు. మూడు సింగిల్స్ మ్యా చ్లు 30 నిమిషాల వ్యవధిలో మూడు గేమ్లలో ఫలితాన్ని నిర్ణయిస్తారన్నారు. లీగ్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్కు అర్హత పొందుతాయన్నారు. ఆగస్టు మధ్యలో జరిగే ఈ ప్రొ-క్యారమ్స్ మ్యాచ్లు రోజూ సాయంత్రం 4 నుంచి 8గంటల వరకూ జరుగుతాయన్నారు. ప్రైజ్ మనీ 15 లక్షల రూపాయలుగా నిర్ణయించిన ఈవెంట్ వేదికలు త్వరలోనే ఖరారవుతాయన్నారు.