విశాఖ

కలకలం రేపిన జంట హత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగుల, ఆగస్టు 18: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలంలో గురువారం జంట హత్యల సంఘటన చోటుచేసుకుంది. మంచిగా ఉండమని మందలించిన తండ్రిని కుమారుడు దారుణంగా హత్య చేయగా, తన తండ్రిని హత్య చేశాడనే అక్కసుతో మరో గిరిజనుడిని హత్య చేసిన ఘటనలు కలకలం రేపాయి. జి.మాడుగుల పంచాయతీ మాలగరువు గ్రామానికి చెందిన పాంగి ప్రసాద్ మద్యం సేవించి గురువారం ఉదయం ఇంటికి వెళ్లి కొడుకు నాగేశ్వరరావును మంచిగా ఉండమని, చెడు తిరుగుళ్లు తిరగవద్దని మందలించాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ పెరిగింది. కోపోద్రికుడైన నాగేశ్వరరావు తండ్రి ప్రసాద్‌ను కత్తితో గుండెల్లో పొడవగా అతను అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
అదేవిధంగా మండలం కోరాపల్లిలో గురువారం ఉదయం మరో హత్య జరిగింది. కోరాపల్లి గ్రామానికి చెందిన కొర్రా చిరంజీవి నాయుడు తండ్రి రాంనాయుడును అదే గ్రామానికి చెందిన సింహాచలం నాయుడు జనవరి 20న హత్య చేసాడు. హత్య కేసులో జైలులో ఉన్న సింహాచలం నాయుడు ఇటీవల బెయిల్‌పై గ్రామానికి వచ్చాడు. తన తండ్రిని చంపిన సింహాచలంనాయుడుపై కక్ష పెంచుకున్న చిరంజీవి నాయుడు సింహాచలం నాయుడుని గురువారం ఉదయం గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చాడు. పొలం పని చేసుకుంటున్న సింహాచలం నాయుడు వద్దకు చిరంజీవినాయుడు వెళ్లి పొలం వద్దనే ఉన్న గొడ్డలి తీసుకుని కిరాతంగా నరికి హత్య చేసాడు. ఈ రెండు జంట హత్య సంఘటనలపై పోలీసులకు అందిన పిర్యాదు మేరకు జి.మాడుగుల పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని హతమార్చిన నాగేశ్వరరావు పరారీలో ఉండగా, సింహాచలం నాయుడుని హత్య చేసిన చిరంజీవి నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జి.మాడుగుల మండలంలో వరుసగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటుండడంతో మండల వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.