వరంగల్

అనారోగ్యంతో భర్త..వడదెబ్బతో భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్మెట, ఏప్రిల్ 3: గత కొన్ని మాసాలుగా అనారోగ్యంతో బాధపడుతూ భర్త మృతిచెందగా రోదిస్తున్న భార్య ఆకస్మాత్తుగా నేలపై పడి మృతిచెందిన సంఘటన నర్మెట మండలం మల్కపేట గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... మల్కపేట గ్రామానికి చెందిన భూక్య కిష్ట(75) గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. భార్య బన్నీ(68) భర్త శవంపై ఏడుస్తూ వడదెబ్బకు గురై ఆదివారం ఉదయం నేలపై పడిపోయింది. వెంటనే స్థానిక వైద్యునితో వైద్య పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తుండగానే ఆమె మృతిచెందింది. ఏమాత్రం ఆహారం తీసుకోకపోవడంతో పాటు నీరు కూడా తాగకపోవడం వల్ల ఆమె వడదెబ్బకు గురై మృతిచెందిందని గ్రామస్థులు తెలిపారు. 24గంటల్లోనే ఇద్దరు మృతిచెందడంతో గ్రా మంలో విషాదఛాయలు నెలకొన్నాయి. భార్యభర్తలు మృత్యువులోనూ వీడని బంధంతో వెళ్లడం పట్ల గ్రామస్థులు కంటనీరు పెట్టారు.