వరంగల్

నజర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, డిసెంబర్ 14: సహకార ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో సహకార ఎన్నికల సన్నాహాలకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ అండ్ రిజిస్టార్ ఆదేశాల మేరకు ఓటర్ల తయారీ షెడ్యూలను విడుదల చేశారు. దీంతో ఎన్నికలకు ప్రభు త్వం పచ్చజెండా ఊపినట్లయ్యింది. శాసనసభ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడడంతో ఇదే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే రైతులు తమకు అండగా ఉంటారని భావించి ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఎన్నికల ప్రక్రియపై జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ముఖ్య కార్యనిర్వహణాధికారులతో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 1లక్ష 5వేల ఓటర్లను ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూరల్ జిల్లాలో మొత్తం 32 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. వీటిలో 1 సంగెం ప్రాథమిక సహకార సంఘానికి ఎన్నికల కాల పరిమితి 2020 వరకు ఉంది. దీంతో 31 ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొత్తం 1లక్ష 58 మంది ఓటర్లు ఉండగా అధికారులు మాత్రం అర్హత కలిగిన వారిని 1 లక్ష 5 వేల మంది ఓటరుగా గుర్తించారు. అయితే ప్రభుత్వం సంఘాల్లోని సభ్యులకు ఓటు అర్హత నియనిబంధనలను జారీ చేసింది. 31-12-2017లోపు సభ్యునిగా ఉన్న వారికి ప్రస్తుతం ఓటు హక్కు బాకీలు చెల్లించక మొండిగా వ్యవహరిస్తున్న వారిని, మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. సంవత్సరానికి రూ. 300 చెల్లించి సభ్యులుగా ఉన్న వారు ఓటు వేసేందుకు అర్హులు. సభ్యుడికి భూమి కూడా ఉండాలి. మొండి బకాయిలను ఈ నెల 27 లోపు చెల్లించి ఓటు హక్కును పునరుద్దరించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. తెలంగాణలో ఇప్పుడు కొత్త జిల్లాల ఆధారంగా సహకార ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణ కోసం ఈసారి కొత్తగా స్టేట్‌కో ఆపరేటివ్ ఎలక్షన్ ఆథారిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి సహకార శాఖ అదనపు ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ విడుదల చేశారు. 14న సహకార సంఘాల పాలక వర్గాలు ఓటర్ల జాబితాను ప్రదర్శించాలి, 21 లోపు అభ్యంతరాలను స్వీకరించాలి, 22న తుది ఓటర్ల జాబితా ప్రదర్శించాలి, 23న తయారు చేసిన తుది ఓటర్ల జాబితాను జిల్లా సహకార అధికారికి పంపించాలి, 24 నుంచి 27 వరకు జిల్లా సహకార అధికారి అభ్యంతరాలను స్వీకరిస్తారు, 28న జిల్లా సహకార అధికారి తుది ఓటర్ల జాబితాను ఖరారు చేస్తారు. 30న తుది జాబితాను జిల్లా సహకార అధికారి స్టేట్ కో ఆపరేటివ్ ఎన్నికల ఆథారిటీకి పంపించనున్నారు.

వరంగల్‌లో ప్రజాకూటమి
పప్పులు ఉడకలే..!
అమరావతి డబ్బులతో వరంగల్ పశ్చిమలో టీడీపీ పోటీ
బాబు కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారు
నాలుగోసారి గెలుపుతో నా బాధ్యత మరింత పెరిగింది
విపక్షాలు నాపై చేసిన ఆరోపణలు కుట్రే
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్

వరంగల్, డిసెంబర్ 14: వరంగల్‌లో ప్రజా కూట మి పప్పులు ఉడకలేదని, ఉమ్మడి వరంగల్ నాలు గు జిల్లాల్లో కూటమి కుదేలైపోయిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందిన దాస్యం వినయ్‌భాస్కర్ మొదటి సారిగా శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ముసుగులో టీడీపీ ఏకంగా వరంగల్ పశ్చిమపై పోటీకి దింపడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందన్నారు. అమరావతి డబ్బులతో ఓట్లను కొనుగోలు చేసి వరంగల్ పశ్చిమలో గెలుపొందాలనే టీడీపీ చేసిన కుట్రలను ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద కూటమి కుట్రలు పారలేదన్నారు. వరసగా నాలుగుమార్లు తనను ఇక్కడ నుండి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. కేసీఆర్ సంక్షేమ ఫలాలే తనను భారీ మెజార్టీతో గెలిపించాయని అన్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి అభ్యర్ధులు తనపై చేసిన ఆరోపణలకు ప్రజలే ఓటర్ రూపంలో సమాధానం ఇచ్చారని అన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం వ్యక్తిగత విమర్శలు చేసిన మహాకూటమి నాయకులకు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన విధంగా గుణపాఠం చెప్పి తిరిగి వారిని అమరావతికే పంపించారని అన్నారు. ఈ ఎన్నికల్లో తనకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా కేటీ ఆర్‌కు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. యువనేత కేటీఆర్ కృషి వల్లే గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వంద సీట్లు గెలుచుకున్నామని, అదే తరహా అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు గెలుచుకోవడం వెనుక కేటీఆర్ కృషి ఉందన్నారు. ప్రజలు కేటీఆర్ నాయకత్వం మొగ్గుచూపుతున్నారని అనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలు మాని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు. సమావేశంలో కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, డీప్యూటీ మేయర్ సిరాజుద్దీన్ పాల్గొన్నారు.