S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘భలే భలే మగాడివోయ్’ చిత్రం విడుదలయ్యాక హీరో నాని జోరు పెంచాడు. గతంలో ఏడాదికి ఒక్క సినిమా చేస్తే ఆ ఒక్కటీ విడుదలకు నోచుకోక, చివరికి ఏదో విధంగా విడుదలై విజయవంతం కాకపోతే స్టార్డమ్ కాస్త పడిపోతుందన్న ముందుజాగ్రత్తతో ఇప్పుడు ఎడాపెడా చిత్రాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఇటీవలే ‘జై బాలయ్య’ చిత్రాన్ని ప్రారంభించాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రారంభించిన చిత్రం సెట్స్పై వుంది.
సుధీర్బాబు, వామిఖ జంటగా 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్కుమార్రెడ్డి, శశిధర్రెడ్డి రూపొందించిన ‘్భలే మంచిరోజు’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 25న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవల మహేష్బాబు విడుదల చేసిన ఆడియోకు, ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోందని, అన్ని వర్గాల ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయని తెలిపారు.
ఇటీవల చెన్నైలో కురిసిన భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన అనేకమంది బాధితుల సహాయార్థం ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తరఫున 5 లక్షల విరాళం ఇస్తున్నట్లు అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. ఫిలిమ్ ఛాంబర్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తల్లిలాంటి చెన్నైకి ప్రస్తుతం కడగండ్లు మిగిలాయని, తమ జీవితాలే అక్కడ ప్రారంభమయ్యాయని తెలిపారు.
ఈమధ్య టాలీవుడ్లో యువ హీరోయిన్ల హవా ఎక్కువైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఒకరిని మించి మరొకరు గట్టి పోటీ ఇస్తూ అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. తాజాగా ఓ సినిమాలో హీరోయిన్గా అవికాగోర్కు వచ్చిన అవకాశాన్ని కొట్టేసింది ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ హెబాపటేల్. ఆ సినిమాతో యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని హాట్ హాట్ అందాలతో యువ హృదయాలని అలరించిన హెబాకు ఇపుడు టాలీవుడ్లో అవకాశాల జోరు పెరిగింది.
నలభై సంవత్సరాల క్రితం విడుదలైన ‘షోలే’ చిత్రంలో జై-వీరూ పాత్రల్లో స్నేహితులుగా నటించిన ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో వారిద్దరూ పక్కనే డిక్కీ ఉన్న స్కూటర్పై ప్రయాణిస్తూ పాడిన ‘ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే’ పాట అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఆనాటి దృశ్యాన్ని కళ్లకు కట్టేలా మళ్లీ ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ ఒక్కటైనారు.
అశోక్కుమార్, కిరణ్, మేఘశ్రీ ప్రధాన తారాగణంగా అర్పితా క్రియేషన్స్ పతాకంపై మనోన్.ఎం. దర్శకత్వంలో పత్తికొండ కిరణ్ రూపొందించిన హారర్ సస్పెన్స్ చిత్రం కాకి ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది.
బాహుబలితో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు భల్లాలదేవ అలియాస్ రానా. ప్రస్తుతం బాహుబలి-2 కోసం సిద్దమైన రానా ఇపుడు సోలో హీరోగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. లేటెస్టుగా రానా హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే వీరిమధ్య కథా చర్చలు కూడా జరిగాయట. ఆగడు, బ్రూస్లీ సినిమాల అపజయంతో కాస్త డీలాపడ్డ శ్రీనువైట్లకు ఇపుడు స్టార్ హీరోలతో సినిమాలు లేవు.
కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్కు వచ్చిన వరుస అపజయాలతో కాస్త వెనుకపడ్డాడు. కాస్త బ్రేక్ తీసుకుని ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి దిల్రాజు బ్యానర్లో చేస్తున్న కృష్ణాష్టమి సినిమా అయితే మరొక సినిమా వంశీ ఆకెళ్ళ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమాకు ఇప్పుడు టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది. టాలీవుడ్ సంచలన దర్శకుడు రాజవౌళి పేరు..
శివ, మేఘశ్రీ జంటగా జె ప్రొడక్షన్స్ పతాకంపై జె.ప్రభాకర్రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’. ఈ చిత్రానికి సంబంధించిన పాటల ప్రదర్శన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, కామెడీతో కూడిన థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో కమర్షియల్ చిత్రానికి కావలసిన హంగులన్నీ ఉన్నాయని, సంగీతం, కెమెరా పనితనం హైలెట్గా వుంటాయని తెలిపారు.
పవర్స్టార్ పవన్ కళ్యణ్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సర్దార్ గబ్బర్సింగ్ సినిమా ప్రస్తుతం గుజరాత్లో జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్గా గ్లామర్ భామ కాజల్ నటిస్తుంది. మరో అందాల భామ లక్ష్మీరాయ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రస్తుతం ఓవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు కాజల్తో సాంగ్ను చిత్రీకరిస్తున్నారు.