S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/31/2018 - 19:12

ప్రముఖ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె.రాఘవ (105) గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలుగు చలనచిత్ర సీమలో ఓ శకం దాదాపు ముగిసింది. సినిమా రంగానికి ‘కష్ట్ఫేలి’ అనే మాట బాగా వర్తిస్తుందనడానికి రాఘవనే నిదర్శనం.

07/31/2018 - 19:08

పచ్చని మొక్క ప్రాణ వాయువుని ఇస్తుంది. కాలుష్యం నుంచి మనిషిని కాపాడుతుంది. నిరంతర కాలుష్యంతో ప్రమాదపుటంచును తాకుతున్న మానవాళిని జాగృతం చేయడమే ధ్యేయంగా పలు అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఉద్యమమే హరితహారం. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేయడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న మార్గమిది. మొక్కలు నాటడమే దీని ఉద్దేశ్యం.

07/31/2018 - 19:06

మనలో చాలామందికి బ్రాండ్స్‌పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడం సహజమే. ఒక్కసారి ఆ బ్రాండ్ పిచ్చి అలవాటైతే అదో వ్యాపకంగా మారిపోతుంది. మరి అలాంటి బ్రాండ్‌బాబుకు.. ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్ బాబు. మారుతి కథ అందిస్తున్న ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాడు కన్నడ హీరో సుమంత్ శైలేంద్ర.

07/31/2018 - 19:05

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్‌లుగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ‘సాక్ష్యం’. ఈనెల 27న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సక్సెమీట్ జరిగింది. ఈ సక్సెస్‌మీట్‌లో హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ- ‘అమేజింగ్ కానె్సప్ట్.

07/31/2018 - 19:03

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో ఆర్.మాధవన్, భూమిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం టాకీపార్ట్ ఆగస్టు 8తో పూర్తికానుంది. ఆగస్ట్ 15న ఫారిన్‌లో ఆఖరి పాటను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 15నాటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తోపాటు సీజీ వర్క్‌కూడా పూర్తికానుంది.

07/31/2018 - 19:01

సమీర్, పవిత్ర లోకేష్, మధుమని, శృతి తదితరులు నటించిన ‘ముద్దుగారే యశోద’ వెబ్ సిరీస్ స్పెషల్ షోని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రముఖులకోసం ప్రదర్శించడం జరిగింది. గాయని సునీత, ఉత్తేజ్, బిత్తిరి సత్తి, కళ్యాణి మల్లిక్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయని సునీత మాట్లాడుతూ.. దర్శకురాలు శ్రీచైతూ ఇదివరకే నాతో రాగం అనే షార్ట్ఫిలిం చేసింది. నాకు చాలా ఇష్టమైన సినిమా అది.

07/31/2018 - 18:58

ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీరాజ్, సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. ఈ చిత్రాన్ని సారా క్రియేషన్స్ బ్యానర్‌పై రమాగౌతమ్ నిర్మిస్తున్నారు. గౌతమ్ రాజ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణానంతర పనులు పూర్తిచేసుకుని సెన్సార్‌కు రెడీ అయింది. ఈ చిత్రానికి శాండీ సంగీతాన్ని అందిస్తున్నారు.

07/30/2018 - 20:40

అడివి శేష్ నటిస్తోన్న గూఢచారి చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతున్నారు శోభిత ధూళిపాళ. తెలుగమ్మాయి అయినా శోభిత మోడలింగ్‌లో రాణించింది. తాజాగా నటిస్తున్న గూఢచారి సినిమా గురించి స్పందిస్తూ- మాది తెనాలి. నేను పెరిగినదంతా వైజాగ్‌లో. అక్కడ ప్లస్ టు చదివాక ముంబై వెళ్లాను. అక్కడే డిగ్రీ చేశాను. అప్పుడే మిస్ ఇండియాకు వెళ్లాను. ఆ తర్వాత అనురాగ్ కశ్యప్‌తో హిందీలో తొలి సినిమా చేశా.

07/30/2018 - 20:37

సుశాంత్, రుహానీశర్మ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్స్‌పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో జస్వంత్ నడిపల్లి, భరత్‌కుమార్ మలశాల, హరి పులిజల నిర్మాతలుగా రూపొందిన చిత్రం ‘చి ల సౌ’. ఈ చిత్రం ఆగస్టు 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ చెప్పిన విశేషాలు... నేను ముంబైలో ఉద్యోగం వదిలేసి అసిస్టెంట్ డైరెక్టర్ అవుతామనే ఇండస్ట్రీలోకి వచ్చాను. కొన్ని యాడ్స్ చేశాను.

07/30/2018 - 20:33

యువ హీరో సుశాంత్, రుహాని శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘చి.ల.సౌ’. ఈ చిత్రం ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర హీరో సుశాంత్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.. పాత మాస్ సినిమాలు చేయడం విసుగు తెప్పించింది. నా వయసుకు సరిపోయే లవ్ స్టోరీలతో డిఫ్రెంట్‌గా సినిమాలు చేస్తే తప్ప, ప్రేక్షకులు నన్ను ఇష్టపడుతున్నారా లేదా అన్న విషయం తెలుస్తుంది.

Pages