తూర్పుగోదావరి

క్రీడల్లోనూ ప్రావీణ్యం సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 23: విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రావీణ్యత సాధించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో జిల్లా క్రీడాభివృద్ధి మండలి సహకారంతో నిర్వహించిన 2017 ఒలింపిక్ రన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడుతూ చిన్నారుల మొదలుకుని పెద్దవారి వరకు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు శరీర ధారుఢ్యం కలిగి ఉంటుందన్నారు. అదనపు ఎస్పీ ఎఆర్ దామోదర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగాల కోసం అనేక రకాల పరీక్షలను రాసినప్పటికీ ఉద్యోగాలు రావడం అరుదని క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. అనంతరం ఆయన ఒలింపిక్ క్రీడా జ్యోతిని వెలిగించి రన్‌ను అక్కడి నుండి రంగరాయ వైద్య కళాశాల వరకు తిరిగి మళ్లీ మైదానం వరకు మూడు కిలోమీటర్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహం, డిఎస్‌డిఎ సయ్యద్ సాహెబ్, జిజిహెచ్ సూపరింటెండెంట్ ఎం రాఘవేంద్రరావు, పిల్లి సత్తిబాబు, ఒలింపిక్ సంఘం సభ్యులు తాతబ్బాయి. చిన్నారి, రంగారావు, పిఇటిలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.