అంతర్జాతీయం

దుర్భేద్యం.. మోదీ బస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలేం, జూలై 5: మూడు రోజుల పర్యటనకోసం వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన హోటల్‌లో మోదీకి బస ఏర్పాటు చేసింది. కింగ్ డేవిడ్ హోటల్‌లో మోదీ బస చేసిన సూట్‌ను బాంబు దాడులు, రసాయనిక దాడులు.. ఇలా ఎలాంటి దాడులు కూడా ఏమీ చేయలేవని ఆ హోటల్ ప్రతినిధి షెల్డన్ రిట్జ్ చెప్పారు. మోదీ, ఆయన ప్రతినిధి బృందం ఉండేందుకు వీలుగా హోటల్‌లోని 110 గదులను ఖాళీ చేయించామని ప్రధాని మొత్తం పర్యటన ఇన్‌చార్జి కూడా అయిన రిట్జ్ చెప్పారు.
క్లింటన్ మొదలుకొని మూడు వారాల క్రితం పర్యటించిన డొనాల్డ్ ట్రంప్ దాకా ఈ శతాబ్దపు అమెరికా అధ్యక్షులందరు కూడా ఇదే హోటల్‌లో బస చేశారని, ఇప్పుడు మోదీ బస చేస్తున్నారని ఆయన చెప్పారు. భద్రతా ఏర్పాట్ల విషయంలోనే కాకుండా మోదీ ఆహారపు అలవాట్ల విషయంలో కూడా హోటల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. పూర్తిగా శాకాహారి అయిన ప్రధానికోసం ఆయనకు ఇష్టమైన గుజరాతీ వంటకాలనే ప్రత్యేకంగా తయారు చేయిస్తోంది. చివరికి ఆయన తినే కుకీలలో కోడిగుడ్లు, చక్కెర లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు, మోదీ బసచేసిన సూట్‌కు ప్రత్యేకంగా కిచెన్ అటాచ్ అయి ఉంది. ఆయన ఏదయినా కోరిన పక్షంలో నిమిషాల్లో తయారు చేసి ఇస్తారని రిట్జ్ చెప్పారు. అంతేకాదు, భారతీయ ప్రతినిధి బృందం కోరిన పూలతో మోదీ బస చేసిన ప్రాంతాన్నంతా అలంకరించారు.