అదిలాబాద్

ఢిల్లీ ధర్నాకు తరలిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి: ప్రజాస్వామ్య హక్కులను రక్షించే గొంతులను నొక్కుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వ ఆగడాలను ఎండగట్టేందుకు ఈనెల 21వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే వామపక్షాల ధర్నాను జయప్రదం చేయాలని ఎంసిపిఐయూ జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపు నిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఎంసిపిఐయూ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబపాలనతో రాష్ట్రం భ్రష్టుపడుతుందని విమర్శించారు. కీలకమైన ప్రజాసమస్యలను గాలికి వదిలేసి, గారడిమాటలు, ప్రజలను మభ్యపెట్టే చేష్టలు చేస్తూ ప్రజా వ్యతిరేకపాల నకొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి విధానాలు ఇలాంటిపాలననురాష్ట్రప్రజలు ఎన్నడు చూడలేదని తెలిపారు. ఈ ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియడంకోసం వామపక్ష పార్టీలు సంఘాలు ప్రజాస్వామ్య వాధులు స్వచ్చందసంస్థలు ఈనెల 21వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధర్నాకు ఎంసిపిఐయూ జాతీయ ప్రధానకార్యదర్శి ఎండి గౌడ్, రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్‌లు హాజరు అవుతారని తెలిపారు. వామపక్షాల ధర్నాను ప్రతిఒక్కరు విజయవంతంచేయాలని కోరారు. సమావేశంలోనాయకులు వడ్లూరి సదానందం, పసులేటి వెంకటేష్, సబ్బని రాజేంద్రప్రసాద్, ఆరేపల్లి రమేష్, లింగంపల్లి శంకర్, బండిమల్లేష్, మంద దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.