వరంగల్

టీకాలు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి: జిల్లాలో ఈనెల 17 నుండి నిర్వహిస్తున్న మిజిల్స్, రుబెల్లా టీకాలను తొమ్మిది నెలల వయస్సు నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికి తప్పని సరిగా వేయాలని రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం మిజిల్స్, రుబెల్లా టీకాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలలో 1,51,172 మంది తొమ్మిది నెలల నుండి 15 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారని, వీరందరికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి టీకాలను వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి అశోక్ ఆనంద్, విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.