శ్రీకాకుళం

గొరియాపాడులో అతిసార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, జూన్ 2: మండలంలోని ఎం.ఎల్.పురం గ్రామ పంచాయతీ పరిధిలోని గొరియాపాడు గిరిజన గ్రామంలో అతిసార విజృంభించింది. 15 మంది అస్వస్థతకు గురయ్యరు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గ్రామంలోని వ్యాధిబారిన పడిన రోగులు కొంతమంది ఇంటి వద్ద చికిత్స పొందుతుండగా, మరికొంతమంది చొర్లంగి పిహెచ్‌సి ఆసుపత్రిలో చేరారు. వ్యాధి ప్రబలడానికి కలుషిత నీరే కారణమని భావిస్తున్నారు. రోగులకు చికిత్స నిమిత్తం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వ్యాధిబారిన బిడ్డిక లలిత, రామారావు, గురవమ్మ, సాయింత్, భారతమ్మ తదితర రోగులున్నారు. వీరందరికీ చొర్లంగి పిహెచ్‌సికి తరలించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్యాధికారి రాజేష్‌ప్రధాన్ రోగులకు వైద్యసేవలందించారు. గ్రామంలో ఎస్‌పిహెచ్‌ఒ వెంకటరావు సందర్శించి వైద్య సేవలను పర్యవేక్షించారు.