తూర్పుగోదావరి

ఆత్రేయపురం చేరిన శ్రీ కాళహస్తీశ్వరుని రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయపురం, జూన్ 3: కాళహస్తీశ్వరుని రథయాత్ర శుక్రవారం ఆత్రేయపురం మండలం చేరుకుంది. మండలంలోని ర్యాలీ జగన్మోహిని, కేశవస్వామి ఆలయం కోనసీమ తిరుపతిగా పేరు పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, ఆత్రేయపురం శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాల వద్ద శ్రీ కాళహస్తీశ్వరుని ఆలయాల వద్దకు రథం చేరుకోవడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సాయి, రామకృష్ణ, సుబ్రహ్మణ్యేశ్వరశర్మలు కాళహస్తీశ్వర స్వామి విశిష్టతను తెలియజేశారు. పలు దేవస్థానాలవద్ధ ధర్మ ప్రచార రథం ఉంచుతామన్నారు. ఈ నెల 13 వరకూ జిల్లాలోని పలు మండలాల్లో ఈ రథయాత్ర సాగుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో జివి రవికుమార్, గోపి, బాబు, చెంగళరావు, శ్రీనివాసులు, కుమార్, పిసి బాబు పాల్గొన్నారు.