తూర్పుగోదావరి
మత్స్యకారుల వలకు 50 కిలోల చేప!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 4 June 2016
యు కొత్తపల్లి, జూన్ 3: ఉప్పాడ - సూర్యాపేట సముద్రతీర ప్రాంతంలో 50 కేజీల చేప మత్స్యకారుల వలకు శుక్రవారం చిక్కింది. సుమారు 7 అడుగుల పొడవున్న ఈ చేప అమోరియా అనే మత్స్యకారుడి బోటుకు పడింది. ఈ చేపను మత్స్యకారులు కుంభకోనెంగా పిలుస్తారు.
రూ.1.5 లక్షల చేపలు సీజ్
లక్షా 50 వేల విలువ చేసే చేపలను మత్స్య శాఖ అధికారులు, మెరైన్ పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం సముద్రంలో చేపల వేట నిషేధం అమలుకావడంతో వేటకు వెళ్లి చేపలను అక్రమంగా తరలిస్తున్న ఆటోను ఉప్పాడ పిఠాపురం రోడ్డులో తుని మత్స్యశాఖ అధికారి వెంకట్రావు ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. వేట నిషేధం సమయంలో చేపలు పట్టుకుంటున్న మత్స్యకారులపై చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.