శరవేగంగా ధ్రువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ‘ధ్రువ’ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కాశ్మీర్‌లో షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ వివరాలు తెలియజేశారు. ‘ఇటీవలే కాశ్మీర్‌లో ఓ మెలోడీ సాంగ్‌ను చిత్రీకరించాం. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. రాంచరణ్ పాత్ర చాలా ఫ్యాషన్‌గా వుంటుంది. సురేందర్‌రెడ్డి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఆయన స్టైలిష్ మేకింగ్ మరోసారి ఈసినిమాలో చూస్తారు. అరవింద్‌స్వామి పాత్ర చిత్రానికై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. విభిన్నమైన కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానుల అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. తమిళంలో వంద కోట్ల మార్కెట్‌ను దాటిన ‘తనిఒరువన్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆగస్టులో పాటలను చిత్రీకరించి చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేస్తాం’ అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:పి.ఎస్.వినోద్, సంగీతం:హిప్ హాప్ ఆది, ఆర్ట్:నాగేంద్ర, ఎడిటింగ్:నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:వి.వై.ప్రవీణ్‌కుమార్, కోప్రొడ్యూసర్:ఎన్.వి.ప్రసాద్, నిర్మాత:అల్లు అరవింద్, దర్శకత్వం:సురేందర్‌రెడ్డి.