17న వజ్రాలు కావాలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీపాద ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనీల్ బూరగాని, నేహా దేశ్‌పాండే, నికిత ప్రధాన తారాగణంగా పి.రాధాకృష్ణ దర్శకత్వంలో కిషోర్ కుమార్ కోట రూపొందించిన సినిమా ‘వజ్రాలు కావాలా నాయనా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 17న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కిషోర్‌కుమార్ కోట చిత్ర వివరాలు తెలుపుతూ- కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనే మంచి ఆశయంతో ఈ సినిమాను రూపొందించామని, ప్రేక్షకులకు నచ్చే కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సంగీతం, పాటలు హైలెట్‌గా వుంటాయని తెలిపారు. సెన్సాన్ సభ్యులు సినిమాను చూసి మంచి ఎంటర్‌టైనర్ అని ప్రశంసించడంతో సినిమా విజయంపై నమ్మకం వచ్చిందని, అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తయిన ఈ సినిమాను 17న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నామని ఆయన తెలిపారు. విజయ్ సాయి, చిట్టిబాబు, శివ, అశ్విని, కుందన తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:పి.అమర్‌కుమార్, సంగీతం: జాన్ పోట్ల, పాటలు:సురేష్ గంగుల, ఎడిటింగ్:రామారావు.జె.పి., కథ, నిర్మాత:కిషోర్‌కుమార్ కోట, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:పి.రాధాకృష్ణ.