- వి. హనుమంత రావు మాజీ ఎంపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరలింపును అడ్డుకుంటాం!

బైసన్ పోలో గ్రౌండ్‌కు సచివాలయాన్ని తరలించాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. తరలింపును కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలతో కలిసి అడ్డుకుంటుంది. వాస్తు బాగా లేదన్న వంకతో సచివాలయాన్ని తరలించాలన్న ఆలోచన మంచిది కాదు. వాస్తు బాగా ఉన్నందుకే కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అసలు ఆరు నెలలకు ఒకసారి సచివాలయానికే రాని ముఖ్యమంత్రికి వాస్తుతో పని ఏముంది. ప్రస్తుతం ఉన్న సచివాలయమే తెలంగాణలోని అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంది. అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. ఎక్కడి నుంచైనా వచ్చేందుకు వీలుంది, చుట్టుపక్కల వసతి సౌకర్యాలూ ఉన్నాయి. పైగా సచివాలయం చుట్టూర రోడ్లు ఉన్నాయి.