S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

02/07/2019 - 19:06

అదే సమయంలో దక్షకన్య సురభి అక్కడికి వచ్చి, చితిపై నిలిచి తన నోటినుంచి శ్రేష్ఠమైన పాలను రాజధర్మునిపై పడేటట్లు చేసింది. దాని వలన ఒక శ్రేష్ఠం బ్రతికి, ఎగిరి విరూపాక్షుని దగ్గరకు వచ్చింది. అప్పుడే ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చాడు. అతను విరూపాక్షునితో ఇలా అన్నాడు -
‘‘నీవల్ల రాజధర్ముడు జీవితుడు కావటం చాలా అదృష్టం’’.

02/06/2019 - 19:12

రాక్షస రాజుకు గౌతముడు, తన మిత్రుడు నాడీజంఘుడు పంపగా వచ్చాడని తెలిసింది. అతను సేవకులను పంపి గౌతముని సాదరంగా ఆహ్వానించాడు. వారు వేగంగా వెళ్ళి అతనిని రాజభవనంలోకి తెచ్చారు. అతను అక్కడ విరూపాక్షుడు చేసిన సత్కారాలను పొందాడు. రాజు అతని గోత్రాన్ని, శాఖను, బ్రహ్మచర్య సమయంలో చేయవలసిన వేదాధ్యయన గురించి ప్రశ్నించగా గౌతముడు తన కులం గురించి తప్ప ఇంక దేనికి సమాధానం చెప్పలేక పోయాడు.

02/05/2019 - 19:39

భారతదేశానికి ఉత్తరదిక్కున ఒక మ్లేచ్ఛదేశం ఉండేది. ఆ దేశంలో మధ్యదేశీయుడైన వాడు, వేదాధ్యయనం చేయని బ్రాహ్మణుడు ఒక గ్రామానికి భిక్షాటన కోసం వెళ్ళాడు. ఆ గ్రామంలో ఒక బందిపోటు దొంగ ఉన్నాడు. అతను చాలా ధనవంతుడు. అతనికి సమస్త వర్ణాల వివరాలు తెలుసు. పైగా అతను ఆడి తప్పనివాడు. బ్రాహ్మణ భక్తుడు. బ్రాహ్మణుడు అతని ఇంటికి వెళ్ళి భిక్ష అడిగాడు.

02/04/2019 - 19:38

ఇప్పుడు ఎంత ఏడిస్తే ప్రయోజనం ఏమిటి?’’ బంధువులు ఈ మాటలు విని ఏడుస్తూ బాలుని అక్కడ వదిలి బయలు దేరారు.

02/03/2019 - 22:24

పూర్వం నైమిశారణ్య ప్రాంతంలో ఒక గృహస్థుడు ఉండేవాడు. అతనికి ఒక్కడే పుత్రుడు. దురదృష్టవశాత్తు ఆ బాలుడు చిన్న వయసులోనే మరణించాడు. అతని బంధువులంతా రోదిస్తూ ఆ శిశువు శవాన్ని తీసుకుని శ్మశానానికి వచ్చారు. వారు అక్కడ ఆ మృత పిల్లవాని చేష్టలు మాటలు గుర్తు తెచ్చుకొని మరల దుఃఖించసాగారు. వారికి ఆ మృతుని శరీరం అక్కడ వదలి వెళ్ళడానికి కాళ్ళు రాక అక్కడే ఉన్నారు.

02/01/2019 - 19:05

పక్షి మాటలు విని అతను ఆ విథంగానే చేశాడు. అలా చేయడంవల్ల అతని ప్రాణం లేచివచ్చింది. పక్షిచేత ఈ విధంగా సత్కరింపబడేసరికి బోయవానికి కళ్ళవెంట ఆనందంతో నీళ్ళు వచ్చాయి. అతను పక్షితో ఇలా అన్నాడు. ‘‘ఆకలి నన్ను పీడిస్తోంది. నీవు ఏదైనా ఆహారం ఇస్తే తింటాను’’.

01/31/2019 - 19:29

ఒక మహారణ్యంలో ఒక బోయవాడు ఉండేవాడు. అతని రూపం ప్రవర్తన చాలా భీకరంగా ఉండేవి. నల్లటి శరీరంతో ఎర్రటి కళ్ళతో అతను యముడిలా ఉండేవాడు. అతను కర్కశంగా ప్రవర్తించడం వలన అతనికి మిత్రులు కూడా లేరు.అతని కౄర ప్రవర్తన వల్ల బంధువులు కూడా అతన్ని విడిచి పెట్టారు.

01/30/2019 - 18:36

పూర్వము హిమవత్పర్వతం మీద అనేక మహావృక్షాలు ఉండేవి. వాటిలో ఒక పెద్ద శాల్మలీ వృక్షం కూడా ఉన్నది. అది శాఖోపశాఖలుగా విస్తరించి ఎన్నో పక్షులకు, చిలుకలకు, గోరింకలకు, ఆవాసంగా ఉన్నది. దాని నీడలో ఎంతోమంది బాటసారులు విశ్రాంతి తీసుకునేవారు. దానికి ఎన్నో పూలు పళ్ళూ ఉండేవి. ఆ చెట్టుకు పెద్దబోదె ఉండేది. దాన్ని చూసి ఒకసారి నారదుడు దాని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ‘‘శాల్మలీ! నీవు ఎంత మనోహరంగా ఉన్నావు.

01/29/2019 - 19:39

అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అన్నాడు - ‘‘ఈ దుర్భిక్ష కాలంలో మరో మాంసం దొరకడం సులభం కాదు. నా దగ్గర డబ్బులేదు. ఆకలి బాధతో ఉన్నాను. గతిలేదు. ఈ కుక్క మాంసం పంచభక్ష్య పరమాన్నం అని తలుస్తాను’’.
ఛండాలుడు ఇలా అన్నాడు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశయులు పంచనఖాలు కల ప్రాణులని, ఆపద సమయాల్లో తినవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయ. తినదగని వాటిపై మనసు పెట్టవద్దు’’.

01/28/2019 - 19:03

త్రేతా ద్వాపర యుగాల సంధికాలంలో ఒకసారి ఘోర అనావృష్టి కలిగింది. అది పండ్రెండు సంవత్సరాల దాకా ఉంది. త్రేతాయుగం సమాప్తం అయ ద్వాపర యుగం ప్రారంభం అయ్యే సమయానికి జన సంఖ్య బాగా పెరిగిపోయంది. వర్షాలు లేకపోవటం వలన తినడానికి ఏ ఆహారపదార్ధాలు పండలేదు. ఇంద్రుడు వానలు కురిపించలేదు. గురువు వక్రించాడు. చంద్రుడు దక్షిణ మార్గాన సంచరించసాగాడు. ఆ సమయాన మేఘాలు లేవు. ఇక వానలు ఎక్కడివి? నదులలో నీరు ఇంకిపోసాగింది.

Pages