రచ్చ బండ

గులాబీ గుబాళింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా పార్టీల గుర్తుల ఆధారంగా మీడియాలో పతాక శీర్షికల్లో సైకిల్ దూసుకెళ్ళిందనో, సైకిల్ ఫంక్చర్ అయ్యిందనో, ‘కారు’ స్పీడు, గులాబీ గుబాళించిందనో, రెక్కలు విరిగిన ‘్ఫ్యన్’ అనో ఇలా రకరకాల వార్తలు వస్తుంటాయి. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల కోటాలో రాష్ట్ర శాసనమండలికి (కౌన్సిల్) 12 స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా, పోలింగ్‌కు ముందే ‘గులాబీ గుబాలిస్తోంది..’. కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులు పలువురు ఆ రెండు పార్టీలకు ‘షాక్’లు ఇచ్చారు.
టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో పార్టీ బలోపేతం గురించి ఆలోచించేంత తీరిక లేదు. ఏ నిర్ణయమైనా తీసుకోవాలనుకుంటే తన కోసం వేచి చూడవద్దని, స్వతహాగా తీసుకోవాలని ఆయన పార్టీ నేతలకు చెప్పారు. బాబు తనయుడు లోకేష్ కూడా ఎక్కువ సమయం ఇవ్వడం లేదు.
సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా నువ్వా-నేనా అన్నట్లు పోటీ జరుగుతుంది. కానీ స్థానిక సంస్థల కోటా నుంచి 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న జరగనున్న ఎన్నికల్లో పరిస్థితులు అలా కనిపించడం లేదు. పోటీ కంటే ముందు అభ్యర్థులను కాపాడుకోవడమే కాంగ్రెస్, టిడిపి నేతలకు గగనమైపోయింది. కాంగ్రెస్ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ముందుగానే చేతులెత్తేసింది. ఈ జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సంఖ్య గెలుపొందేంత లేనందున కాంగ్రెస్ గౌరవప్రదంగా తప్పుకున్నది. కాగా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్‌పాటిల్ నామినేషన్‌ను ఉపసంహరించుకుని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ‘షాక్’ ఇచ్చారు. జాతీయ పార్టీ అయిన బిజెపి బరిలోనే లేదు.
తెలుగు దేశం పార్టీ 5 స్థానాల్లో పోటీకి ఉత్సాహంగా దిగింది. కాగా ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో టిడిపి అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టిఆర్‌ఎస్ అన్ని (12) స్థానాలకూ పోటీ చేస్తున్నది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 12వ తేదీన గడువు ముగియనున్నది. గడువులోగా మిగతా అభ్యర్థులు ఉంటారా? ఉపసంహరించుకుంటారా? అని కాంగ్రెస్, టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎన్నుకోవడానికి ఓటర్లు కాబట్టి, ఆయా జిల్లాల్లో పార్టీలు తమకు ఉన్న ప్రజాప్రతినిధుల బలాన్ని బేరీజు వేసుకుని రంగంలోకి దిగాయి.
నల్లగొండ స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తేరా చిన్నపరెడ్డి పోటీకి దిగారు. తెలుగు దేశం పార్టీ నుంచి శ్రీనివాసరావు, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా మల్లేష్‌గౌడ్, మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా పట్నం నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, కాంగ్రెస్ అభ్యర్థులుగా మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్, దారా సింగ్, టిడిపి అభ్యర్థిగా బుక్కా వేణుగోపాల్, ఎంపిటిసీల ఫోరం అభ్యర్థిగా కె. అశోక్‌గౌడ్ బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎ. చంద్రశేఖర్ నామినేషన్ ఉపసంహరించుకుంటారన్న ప్రచారం జరుగుతున్నా, చంద్రశేఖర్ మాత్రం అటువంటిదేమీ లేదని చెబుతున్నారు. మెదక్ జిల్లాలో ఒక స్థానం ఉంది. టిఆర్‌ఎస్ అభ్యర్థిగా వి. భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా శివరాజ్‌పాటిల్, టిడిపి అభ్యర్థిగా కొన్యాల బాల్‌రెడ్డి పోటీకి దిగినా, శుక్రవారం టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు.
వరంగల్ జిల్లాలో ఒక స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి కొండా మురళి ఏకగ్రీవమయ్యారు. టిడిపి అభ్యర్థి నరేందర్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుని టిఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో ఒక స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆర్. భూపతిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా కె. వెంకట రమణారెడ్డి, ఎంపిటీసీల ఫోరం అభ్యర్థిగా బి. జగదీష్ పోటీకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాదరావు, ఇండిపెండెంట్లుగా మునిపాక తిరుపతిరావు, ముద్దసాని రంగయ్య, ముత్యాల ప్రియారెడ్డి, ఎస్. ప్రసాద్ పోటీ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో ఒక స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ, సిపిఐ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వర రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున లింగాల కమల్‌రాజ్ పోటీ చేస్తున్నారు. సిపిఐ అభ్యర్థికి వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయి.
ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్న ఒక ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్‌ఎస్ అభ్యర్థి పురాణం సతీష్‌కుమార్ ఏకగ్రీవమైనట్లే. టిడిపి అభ్యర్థి ఐ. నారాయణ రెడ్డి, ఎంపిటీసిల ఫోరం అభ్యర్థి రియాజుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా ఎస్. జగదీశ్వర్ రెడ్డి, కె. నారాయణ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా కె. దామోదర్ రెడ్డి, టిడిపి అభ్యర్థిగా కొత్తకోట దయాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పోలింగ్‌కు ముందే మా పార్టీ (గులాబీ) గుబాళిస్తోందని టిఆర్‌ఎస్ శ్రేణులు సంతోషిస్తున్నారు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి