మెయన్ ఫీచర్

సహజం.. ‘కోరల మృగా’నికి క్రూరత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రతా దళాలపై రాళ్లు రువ్విన ఆరువందల ముప్ఫై నలుగురిని జైళ్లనుండి విడుదల చేయాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జూలై ఐదవ తేదీన నిర్ణయించిందట! ఇలా రాళ్లు రువ్విన వారు జిహాదీ బీభత్సకారులు, జిహాద్ సమర్థకులు.. వీళ్లందరూ క్రీస్తుశకం 2008 నుంచి 2014 వరకు భద్రతాదళాలతో తలపడినవారు, రాళ్ల కుప్పల వద్ద నిలబడి రాళ్ళతోనే సైనికులను, అనుబంధ సైనికులను కొట్టి గాయపరిచి చంపడానికి యత్నించినవారు. వీరందరూ ఇప్పుడు బుద్ధిమంతులైపోయారట! అందువల్ల ఈ దేశ వ్యతిరేకులకు నిర్బంధ విముక్తిని కలిగించాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నిర్థారించింది. ‘హిజ్‌బుల్ ముజాహిదీన్’ జిహాదీ ముఠాకు చెందిన భయంకర దేశద్రోహి బుర్హన్ లూనీని జూలై 8న అనంతనాగ్ జిల్లాలో భద్రతాదళాలు మట్టుపెట్టిన తరువాత కశ్మీర్‌లోయ ప్రాంతంలో పాకిస్తాన్ అనుకూల ‘ముఠా’లు మరోసారి పెద్దఎత్తున హింసాగ్ని జ్వాలలను రగిలించారు. వివిధచోట్ల జిహాదీలు భద్రతాదళాలపై రాళ్లు విసురుతున్న దృశ్యాలు మరోసారి ఆవిష్కృతమయ్యాయి! ఇదీ జాతీయ వైపరీత్యం. ఎవరు బుద్ధిమంతులయినట్టు? 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముజిబ్ అహ్మద్ అనే వాడిని జైలునుంచి విడుదల చేసింది. కృష్ణప్రసాద్ అనే వరిష్ఠ పోలీస్ అధికారిని హత్యచేసిన ఈ ముజిబ్ అహ్మద్ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ బీభత్సకారుడు. అందువల్ల ఈ ముజిబ్ మళ్లీ పాకిస్తాన్‌కు రాకపోకలు సాగించాడు, భాగ్యనగరంలో పెద్ద ఎత్తున పేలుళ్ళను జరపడానికి రంగం సిద్ధం చేశాడు. మళ్లీ పట్టుబడ్డాడు. ఎవరికి బుద్ధి వచ్చినట్టు! ఇపుడు లష్కర్ ఏ తయ్యబా, జమాత్ ఉద్ దావా, సిమి, ఇండియన్ ముజాహిదీన్ వంటి జిహాదీ ముఠాలకు చెందిన ముష్కరులు కొత్త ‘వేషం’ ధరించారు. ఆ వేషం పేరు ‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం’- ఐఎస్‌ఐఎస్! ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో మాత్రమే కాక దేశమంతటా ‘ఐఎస్‌ఐఎస్’ జిహాదీలు పట్టుబడుతుండడం నడుస్తున్న చరిత్ర. క్రీస్తుశకం పనె్నండవ శతాబ్దాలలో విదేశాల నుంచి వచ్చి పడిన భయంకర జిహాదీ బీభీత్సకారుడు మహమ్మద్ ఘోరీని ఇంద్రప్రస్థ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి ఆ తరువాత క్షమించి వదలిపెట్టాడు. పధ్నాలుగవ శతాబ్దిలో కాకతీయ సమ్రాట్టు ప్రతాపరుద్రుడు కూడ అల్లాఉద్దీన్ ఖిల్జీ ఉసిగొలిపిన జిహాదీ హంతకులను ఆరుసార్లు ఓడించి క్షమించి వదలిపెట్టాడు. ఇలా క్షమాభిక్షకు నోచుకున్న జిహాదీలు ఆ తరువాత వంచనతో పృధ్వీరాజ్‌ను, ప్రతాప రుద్రుడిని ఓడించి, సామాన్య ప్రజలను లక్షలాదిగా ఊచకోత కోయడం చరిత్ర.. పాలకులకు పాఠం నేర్పని చరిత్ర ఇది. ‘జిహాద్’ ప్రతిక్రియాత్మకమైనది కాదు, స్వభావాత్మకమైనది. ‘గోడ’ దూకి ఆవుల గొంతులను కొరికివేయడం తోడేళ్ల కుస్వభావం! అంతర్జాతీయ వైపరీత్యం కూడా వుంది. ఆఫ్రికాలో ‘బోకోహరామ్’ ముఠావారు ఇస్లామేతర మతాలకు చెందిన ఆడపిల్లలను వందలాదిమందిని అపహరిస్తున్నారు. ఈ ఆడపిల్లలు ప్రధానంగా వన మతాలకు చెందినవారు. మరికొందరు బాధితులు క్రైస్తవ మతానికి చెందినవారు. వన మతాలవారు ప్రకృతి ఆరాధకులు, పంచభూతాల ఆరాధకులు. మానవుని మనుగడకు సకల జంతుజాలం మనుగడకు ఈ పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు నక్షత్రాలు దోహదం చేస్తున్నారు. అందువల్ల ఈ కనపడే దేవతలను పూజించడం ఆరాధించడం వనమతాలవారి జీవన పద్ధతి. ఐరోపానుండి చొరబడిన ‘మిషనరీలు’ వన మతాలవారిని క్రైస్తవ మతంలోకి మార్చడం శతాబ్దుల చరిత్ర, ఆ తరువాత చొరబడిన జిహాదీలు వనమతాలవారిని ఇస్లాంలోకి కలిపేశారు. ‘మిషనరీ’ల మతం మార్పిడి దుశ్చర్యలతో సామాన్య క్రైస్తవులకు సంబంధం లేదు. జిహాదీల బీభత్సకాండతో సాధారణ ముస్లింలకు ప్రమేయం లేదు. వైవిధ్య పరిరక్షక హైందవ జాతీయ జీవనయానంలో భారత్‌లో పుట్టిన వేద మతాలు, వైదికేతర మతాలు, నాస్తిక మతాలు, విదేశాలనుంచి వచ్చిన యూదు, పారశీక, క్రైస్తవ ఇస్లాం మతాలు తరతరాలుగా సమాన భాగస్వాములు, వైవిధ్యాలను పరిరక్షించి పెంపొందించే సంస్కృతికి సమాన అధికారులు, సమాన వారసులు. భారతీయమైన ఈ వైవిధ్య పరిరక్షక ప్రవృత్తికి వ్యతిరేకులై ‘మిషనరీలు’, ‘జిహాదీ’లు వైవిధ్యాలను ధ్వంసం చేస్తుండడం శతాబ్దుల అంతర్జాతీయ ఘర్షణలకు కారణం.
ఈ ఘర్షణ ప్రస్తుతం ఆఫ్రికాలో భయంకరంగా రాజుకొంటోంది. అన్య మత విధ్వంసం స్వభావమైన మిషనరీలు జిహాదీలు వన మతాలవారిని క్రైస్తవంలోని ఇస్లాంలోని శతాబ్దులపాటు మార్చిన తరువాత కూడా ఆఫ్రికాలో ఇప్పటికీ దాదాపు మూడవ వంతు ప్రజలు వన మతాలవారే. మన ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దర్శించిన దక్షిణ ఆఫ్రికా, మొజాంబిక్, టాంజానియా, కెన్యా దేశాలలో ఆయనకు వన మతాల ప్రజలు తమ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం చెప్పారు. టాంజానియాలో నలభై శాతం ప్రజలు వన మతాలవారే. టాంజానియాకు ఆనుకొని ఉత్తరంగా కెన్యా విస్తరించింది. కెన్యాకు వాయువ్య ప్రాంతంలోని దక్షిణ సూడాన్ ప్రస్తుతం మతోన్మాద బీభత్స జ్వాలలకు నిలయమైపోయింది. 1956 నుంచి 2011 వరకు ఒక్క సూడాన్ కొనసాగిన కాలంలో ఇస్లాం మత రాజ్యంగా వ్యవస్థ ఏర్పడి ఉంది! దేశంలో అరవై ఐదు శాతం ఇస్లాం మతస్థులు కాగా ముప్ఫై శాతం ప్రాచీన వన మతాలవారు, ఐదు శాతం క్రైస్తవులు.
1989 నుంచి 2004 వరకు వన మతాలవారిని క్రైస్తవులను సూడాన్ ప్రభుత్వం ఊచకోత కోయించింది. దశాబ్దాలపాటు సాగిన ఈ మానవ మేధానికి ఇరవై లక్షల మంది బలైపోవడం చరిత్ర! జిహాదీల స్వభావం ఇది. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులుగా ఉన్న దాదాపు ప్రతి దేశంలోను ‘జిహాదీ’లు నిరంతరం బీభత్సకాండ సాగించి అల్ప సంఖ్యాకులను నిర్మూలించడం నిరాకరింపజాలని నిజం. అఖండ భారత విభజన తరువాత ఏర్పడిన పాకిస్తాన్‌లో 1947లో మూడవ వంతు ఉండిన ఇస్లామేతరులను ‘జిహాదీ’లు నిర్మూలించడం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రస్తుతం పాకిస్తాన్‌లో రెండు శాతం, బంగ్లాదేశ్‌గా మారిన తూర్పు పాకిస్తాన్‌లో ఎనిమిది శాతం మాత్రమే అల్ప సంఖ్యాకులు మిగిలి ఉన్నారు. కానీ సూడాన్‌లోని అల్ప సంఖ్యాకులకు అమెరికా అండగా నిలబడింది! అందువల్లనే ఇస్లామేతరులు అధికంగా ఉన్న దక్షిణ సూడాన్ 2011లో సూడాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. స్వదేశీయులపై దశాబ్దులపాటు జిహాదీ బీభత్సకాండ సాగించిన సూడాన్ ప్రభుత్వాన్ని చైనా ప్రభుత్వం బాహాటంగా సమర్థించింది. సూడాన్‌లో చైనా సంస్థలు లక్షల ఎకరాలలో వాణిజ్య సామ్రాజ్యాలు ఏర్పరచుకొని ఉండడం ఇందుకు కారణం. అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం సూడాన్ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థగా ప్రకటించింది. అధ్యక్షుడు ఉమర్ అల్ బషీర్‌ను నేరస్థుడుగా ప్రకటించింది. అతగాడిని అరెస్టు చేయడానికై వారెంట్ జారీ చేసింది. కానీ ఈ వారెంట్ అమలు జరగకుండా చైనా ఏళ్ల తరబడి నిరోధిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో కూడా చైనా అల్ బషీర్‌ను సమర్థించడం అంతర్జాతీయ వైపరీత్యం! 2011లో సూడాన్ విభజన తరువాత అంతకుపూర్వం జరిగిన ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండను ప్రపంచ దేశాలు దాదాపు మరచిపోయాయి. ఇప్పుడు దక్షిణ సూడాన్‌లో మరో అంతర్యుద్ధం జరుగుతోంది. అంతర్యుద్ధం జరుగుతున్న చోట అనేక వందలమంది భారతీయులు చిక్కుబడి ఉన్నారట. జిహాదీల దాడులకు మైదాన ప్రాంతాల నాగరికులు బెంబేలెత్తిపోవడం అన్ని దేశాలలోను కొనసాగుతున్న మరో అంతర్జాతీయ వైపరీత్యం. మన అస్సాంలో ఇదే జరిగింది.కానీ అస్సాంలోని ‘బోడో’ వనవాసీ ప్రజలు బంగ్లాదేశ్ నుంచి వచ్చి పడిన జిహాదీలను ప్రతిఘటించగలిగారు. సూడాన్‌లో కూడా వన మతాలవారు దశాబ్దులపాటు జిహాదీ మతోన్మాదులను ప్రతిఘటించారు.
‘బోకో హరామ్’ ఆఫ్రికా దేశాలలోని ఆడపిల్లలను అపహరించి జిహాదీలకిచ్చి బలవంతంగాపెళ్లి చేయడం, బానిసలుగా అమ్మివేయడం కూడా శతాబ్దులుగా కొనసాగుతున్న స్వభావాత్మక బీభత్సం. ఇస్లాం మతేతరులను లైంగిక అత్యాచారాలకు గురిచేయడం, బానిసలుగా అమ్మడం, మతం మార్చడం, చంపివేయడం ఈ స్వభావం. మన దేశంలోకి చొరబడిన మహమ్మద్ బిన్ కాసిమ్ అనే అరబ్బీ బీభత్సకారుడు సింధులోని దేవలపట్టులోని తొంభయివేలమంది హిందువులను, నిరాయుధులను దిగ్బంధించి చంపడం చరిత్ర. ఈ ‘స్వభావం’ తరతరాలుగా కొనసాగింది. ‘మహమ్మద్ బిన్ కాసిమ్ చేయగలిగిన పనులను మనం ఎందుకు చేయలేము?’ అన్నది 1907 నాటి వార్షిక సభలో ‘ముస్లిం లీగ్’ చేసిన తీర్మానం స్ఫూర్తి. ఈ తీర్మానం స్ఫూర్తికి అనుగుణంగానే మహమ్మదాలీ జిన్నా నాయకత్వంలోని 1947 నాటి పాకిస్తాన్ ప్రభుత్వం వేలాదిమంది హిందూ బాలికలను, యువతులను లైంగిక అత్యాచారాలకు బలిచేసింది. పిశాచాలు, రాక్షసులు సైతం జడుసుకునే రీతిలో సాగిన ఈ లైంగిక బీభత్సపు వివరాలు ఎస్.గురుబచన్ సింగ్ 1950లో ప్రచురించిన ‘ముస్లిం లీగ్ అటాక్’ అన్న ఆంగ్ల గ్రంథంలో లభిస్తున్నాయి.
సూడాన్ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థగా ప్రకటించిన అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎందుకు ఉపేక్షిస్తోంది? అంతర్జాతీయ జిహాదీ బీభత్సకాండకు సైద్ధాంతిక సమర్థన, నిధులు సౌదీ అరేబియానుండి ప్రధానంగా లభిస్తున్నాయి. చైనా ప్రచ్ఛన్న, వ్యూహాత్మక, దౌత్య సహాయాన్ని కొనసాగిస్తోంది. పాకిస్తాన్ వివిధ జిహాదీ ముఠాలను అనుసంధానం చేస్తోంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ బీభత్స నిరోధక వ్యవస్థ ఏర్పడకపోవడానికి చైనా తెరవెనుక హస్తం కారణం కావచ్చు. ‘అంతర్జాతీయ బీభత్స వ్యతిరేక నియమావళి’ని రూపొందించాలని మన దేశం ఇరవై ఏళ్లుగా కోరుతోంది. అయినప్పటికీ ఈ కాంప్రహెన్సివ్ కనె్వన్షన్ ఆన్ ఇంటర్‌నేషనల్ టెర్రరిజమ్- సిసిఐటి ఏర్పడకపోవడం అంతర్జాతీయ వైపరీత్యం. ఆడపిల్లలను ‘ఐఎస్‌ఐఎస్’ బానిసలుగా అమ్ముతుండడం బీభత్స చరిత్రలో వర్తమాన ఘట్టం.

- హెబ్బార్ నాగేశ్వరరావు