రంగారెడ్డి

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపజేసిన ఘనత టిడిపిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, మార్చి 29: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింప చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మల్కాజిగిరి తెదేపా యంపి సిహెచ్. మల్లారెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మండల రాధాకృష్ణయాదవ్ అధ్వర్యంలో సఫిల్‌గూడ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం చౌరస్తాలోని ఎన్‌టిఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, కేక్‌ను కట్ చేశారు. ఈసందర్భంగా ఎంపి మాట్లాడుతూ తెలుగు ప్రజలు పడుతున్న కష్టాలు చూసి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత దివంగత ఎన్‌టిఆర్‌దే అన్నారు. టిడిపి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమన్నారు. తెలంగాణలో పార్టీ పూర్వ వైభవానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బివి కృష్ణారావు, మండల చిన్నాయాదవ్, సుధాకర్‌రెడ్డి, రాంచందర్, నాగరాజు, పిట్ల శ్రీనివాస్, గొట్ల వెంకటేష్‌యాదవ్, ప్రవీణ్, వగ్గు చంద్రశేఖర్, బత్తిని నర్సింహ్మ, కటికల నరేష్, నాగకుమారి, నర్సమ్మ, స్వర్ణలత, మంజుల, నాగమణి, విజయలక్ష్మీ, సరళ, ప్రభు, రాజేందర్, సంజీవ, గోపాల్ పాల్గొన్నారు.
మల్కాజిగిరి చౌరస్తాలో...
మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో టిడిపి పూర్వ వైభవానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని టిడిపి జిల్లా నాయకుడు మండల రాధాకృష్ణయాదవ్ పేర్కొన్నారు. టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలో జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టిడిపి కార్యకర్తలు ఉన్నారని, నాయకులు పార్టీలు మారినంత మాత్రాన పార్టీకి నష్టం ఏమీ లేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కార్యక్రమంలో పిట్ల శ్రీనివాస్, విజయ్‌కుమార్ యాదవ్, రాంచందర్, చంద్రశేఖర్, కె.నాగరాజు, ప్రవీణ్ పాల్గొన్నారు.