రంగారెడ్డి

బంగారు తెలంగాణ సాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం సంబురంగా జరిగాయి. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి.సునీతారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్‌ను కట్‌చేశారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణాకు బాటలు వేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సంఘటితంగా అవినీతి రహిత పాలన సాగిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో ముందంజలో దూసుకుపోతుందని అన్నారు. జెడ్‌పి ఆవరణలో జరిగిన ఆటల పోటీలలో సునీతారెడ్డితో పాటు జెడ్‌పి సిఇఓ రమణారెడ్డి, జెడ్‌పిటిసిలు జంగారెడ్డి, సతీశ్, ఈశ్వర్ నాయక్, సునీత, జెకె శైలజ, కావలి సునీత, చంద్రలింగంతో పాటు జెడ్‌పి ఉద్యోగులు ఉల్లాసంగా ఆటల పోటీలలో పాల్గొన్నారు. పోటీలలో గెలుపొందిన వారికి సునీతారెడ్డి బహుమతులు అందజేశారు. సిఇఓ రమణారెడ్డి మ్యూజిక్ చైర్‌లో ప్రథమ బహుమతిని అందుకున్నారు.