నెల్లూరు

ట్రాక్టర్, ఆటో ఢీకొని ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వింజమూరు, మార్చి 17: మండలంలోని రావిపాడు అగ్రిగోల్డ్ లేఅవుట్ వద్ద గురువారం మధ్యాహ్నం ట్రాక్టర్, ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా తయారైంది. గరిమెనపెంట నుంచి తొమ్మిది మందితో వింజమూరుకు వస్తున్న ఆటోను వింజమూరు నుంచి సేంద్రియ ఎరువుల లోడుతో ట్రాక్టర్ చాకలికొండ వైపు వెళ్తోంది. ఈక్రమంలో రావిపాడు సమీపానికి రాగానే ట్రాక్టర్, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ట్రాక్టర్ చాలా దూరం ఈడ్చుకుపోయింది. ఆటోలో ఉన్న గరిమెనపెంటకు చెందిన వై పెదఅంజయ్య (65) కడుపుకింద భాగం నుజ్జునుజ్జుగా మారింది. దీంతో ఆటోలోనే ఇరుక్కుపోయి మృతి చెందాడు. అతనితో సహా ఆటోలో ఉన్న ఐతమ్మ అనే మహిళ కూడా ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని తెలుసుకుని అక్కడకు చేరుకున్న స్థానికులు జాగ్రత్తగా వెలుపలకు తీశారు. మరొకరు వరికుంటపాడు మండలం తూర్పురొంపిదొడ్లలోని హైస్కూల్‌లో ఇంగ్లీషు టీచర్‌గా పనిచేస్తున్న రామకోటయ్య నడుము కిందభాగం పూర్తిగా దెబ్బతినడంతో మెరుగైన వైద్యం కోసం కావలి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. వైద్యాధికారిణి శైలజ ప్రాథమిక చికిత్స నిర్వహించి ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై కె వేణుగోపాల్ తెలిపారు.