నిజామాబాద్

అభివృద్ధి పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్మర్‌పల్లి, జనవరి 9: కమ్మర్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మండలంలోని బషీరాబాద్ గ్రామంలో 10లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న గంగపుత్ర సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మానాల గ్రామంలో 7లక్షల సిడిసి నిధులతో యువజన సంఘం భవన నిర్మాణం, 25లక్షలతో చేపట్టిన రెండు అంగన్‌వాడీ భవనాలు, 4లక్షలతో చేపట్టిన మహిళా సంఘం ప్రహారీగోడ, బడితండాలో 5లక్షలతో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనం నిర్మాణాలకు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఉప్లూర్ గ్రామంలో 12.50 లక్షలతో నిర్మిస్తున్న అంగన్‌వాడీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన, చౌట్‌పల్లిలో 5లక్షలతో నిర్మించిన మార్కెట్ యార్డు అదనపు గదులను ఆయన ప్రారంభించారు. కమ్మర్‌పల్లి, బషీరాబాద్, ఉప్లూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు షాదీముబారక్ పథకం కింద 51వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిపి మాలవత్ కౌసల్య, జడ్పీటిసి సభ్యురాలు దాసరి లక్ష్మి, వైఎస్ ఎంపిపి రాజారాం, బషీరాబాద్ సర్పంచ్ బోడ జమున, చౌట్‌పల్లి సర్పంచ్ రాజన్న, ఉప్లూర్ సర్పంచ్ బోడ భూమాయి, కోనాసముందర్ సర్పంచ్ అంజమ్మ, తెరాస మండల అధ్యక్షుడు లుక్క గంగాధర్, నాయకులు భాస్కర్‌యాదవ్, ఏనుగు గంగారెడ్డి, బాపురెడ్డి, శ్రీనివాస్, పార్వతి రాజలింగం తదితరులు పాల్గొన్నారు.