నిజామాబాద్

గిరిజనుల అభ్యున్నతే మా ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ రూరల్, పిబ్రవరి 16: గిరిజనుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో జరిగిన సేవాలాల్ మారాజ్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు మంత్రి సేవాలాల్ మారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కోసం నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. సేవాలాల్ మారాజ్ గిరిజనులకు ఆరాధ్య దైవమన్నారు. మహనీయుడు చూపిన బాటలో గిరిజనులు ఆదర్శంగా తీసుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మంత్రి పోచారంతోపాటు ఇద్దరు కుమారులకు తలపాగ చుట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బద్యానాయక్, మోహన్ నాయక్, రతన్ నాయక్, కిషన్ నాయక్, కొత్తకొండ బాస్కర్, నార్ల సురేష్, అంజిరెడ్డి, ఎజాజ్, జంగం గంగాధర్, బాబుసింగ్ తదితరులు ఉన్నారు.