నిజామాబాద్

కాంగ్రెస్‌లో చేరిన లిఫ్ట్ మాజీ చైర్మన్ బాపురావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, నవంబర్ 15: నందిపేట మండలం డొంకేశ్వర్ ఎత్తిపోతల పథకం మాజీ చైర్మన్ గొల్ల బాపురావుతో పాటు మరో 8మంది టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా కార్యకర్తగా, నాయకుడిగా పని చేసిన బాపురావు రెండున్నరేళ్ల క్రితం తెరాసలో చేరారు. కాగా, తన లిఫ్ట్ చైర్మన్ పదవి కాలం పూర్తికాగానే టీఆర్‌ఎస్ చేపట్టిన ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా స్తబ్ధంగా ఉన్నారు. గురువారం ఆయన స్వచ్ఛందంగా ఎమ్మెల్సీ, ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత సమక్షంలో బాపురావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి వారికి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు సీనియర్ అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ ఆరె గంగాధర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.