రంగారెడ్డి

అక్షయపాత్ర మాకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మార్చి 20: అంగన్‌వాడి వ్యవస్థను అక్షయపాత్రకు అప్పగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీఐటీయు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భూపాల్ అన్నారు. బుధవారం షాద్‌నగర్ సీడీపీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన నిరసన వ్యక్తం చేశారు. షాద్‌నగర్ ఆర్‌డీవో ఎం.కృష్ణకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. భూపాల్ మాట్లాడుతూ అంగన్‌వాడి వ్యవస్థను అక్షయపాత్రకు అప్పగిస్తే సిబ్బంది కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏల బిల్లులు సకాలంలో చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు శ్రీనునాయక్, ఈశ్వర్‌నాయక్, బీసా సాయిబాబా, ప్రశాంత్, అంగన్‌వాడి సిబ్బంది పాల్గొన్నారు.