రంగారెడ్డి
శాంతియుత వాతావరణంలో గణపతి ఉత్సవాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 25 August 2019
జీడిమెట్ల, ఆగస్టు 24: శాంతియుత వాతావఱణంలో గణపతి ఉత్సవాలను జరుపుకోవాలని పేట్బషీరాబాద్ ఏసీపీ నర్సింహా రావు సూచించారు. బహద్దూర్పల్లి గ్రామంలోని మేకల వెంకటేశం గార్డెన్లో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో గణేశ్ చతుర్థి పీస్ మీటింగ్ జరిగింది. ఏసీపీ నర్సింహారావు విచ్చేసి మాట్లాడుతూ గణపతి మండపాలను ఏర్పాటు చేసే వారికి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. నిబంధనలకు అనుగుణంగా గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో దుందిగల్ సీఐ వెంకటేశం, జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, దుందిగల్ ఎస్సైలు భూపాల్, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.