రంగారెడ్డి

పసి పిల్లలను పెంచినట్టు మొక్కలను పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, అక్టోబర్ 29: పసి పిల్లలను పెంచినట్టుగా మొక్కలను పెంచాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి మండల అధికారులను ఆదేశించారు. శనివారం కీసరలోని తహశీల్ధార్ కార్యాలయంలో హరితాహారంపై మండల స్ధాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కనిపించని దైవం కంటే కనిపించే వృక్షాలే మనకు దేవుళ్లని పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితాహారం ఉద్దేశాన్ని అధికారులు గుర్తుంచుకొని విజయవంతం చేయాలని అన్నారు. జిల్లా ఫారెస్ట్ అధికారి వి.కృష్ణ మాట్లాడుతూ రాబోయే కాలంలో జిల్లాను హరిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో డి ఆర్‌డిఏ పిడి ఉమాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.