రంగారెడ్డి

ఇల్లంతకుంట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సరోజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట, జూన్ 14: ఇల్లంతకుంట మార్కెట్ కమిటీ చైర్మన్ బిసి మహిళకు రిజర్వు కావడంతో వెల్జిపూర్‌కు చెందిన గుండ సరోజనను కమిటీ చైర్మన్‌గా, గొల్లపల్లి గ్రామానికి చెందిన రెడ్డి అమరేందర్ రెడ్డిని వైస్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. గడ్డం రాజిరెడ్డి, గుడుగుల నాగరాజు, కర్యావుల మల్లేశం, మీసరగండ్ల అనీల్ కుమార్, ఏనుగుల బుచ్చయ్య, సింగిరెడ్డి రాజిరెడ్డి, ఉప్పల వేణు, మహ్మద్ సాదుల్ సభ్యులుగా ప్రభుత్వం ప్రకటించింది. మండల మార్కెట్ కమిటీ పాలకవర్గం నూతనంగా ఎన్నికైన సభ్యులకు టిఆర్‌ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులు, జడ్పీటిసి, ఎంపిపి ఐలయ్య యాదవ్‌తో కలిసి మానకొండూర్ ఎమ్మెల్యే చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. పాలక మండలి ఎంపికతో మండల కేంద్రంలో టిఆర్‌ఎస్ నాయకులు పండుగ వాతావరణం పార్టీ కార్యాలయంలో నెలకొంది.