రంగారెడ్డి

శ్రీఅభయాంజనేస్వామి విగ్రహ పునః ప్రతిష్ఠాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఏప్రిల్ 14: రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లిలోని శ్రీఅభయాంజనేయ స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకొని దేవాలయ పునఃప్రతిష్ఠాపన ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం అంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు తుంగ నర్సింహ్మారెడ్డి, తుంగ రామ్‌రెడ్డి, తుంగ సత్యనారాయణరెడ్డి, సుమన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, సికిందర్‌రెడ్డి, హనుమంతయ్య సహాయ సహకారాలతో అభయాంజనేయ స్వామి దేవాలయం పునః ప్రతిష్ఠాపన చేపట్టామని నిర్వాహకులు వివరించారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు. కార్యక్రమంలో నాయకుడు సామ ఇంద్రపాల్‌రెడ్డి పాల్గొన్నారు.