రంగారెడ్డి

పేదలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇవ్వకపోతే మరో పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 12: పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వకపోతే మరో పోరాటం చేస్తామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి ఐలయ్య హెచ్చరించారు. జగద్గిరిగుట్ట సిపిఐ కార్యాలయంలో నియోజకవర్గం సిపిఐ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కట్టివ్వకపోతే సిపిఐ ఆధ్వర్యంలో మరో భూపోరాటం తప్పదని హెచ్చరించారు. ఈనెల 13న జగద్గిరిగుట్టలో భూపోరాట సమరభేరికి రాష్ట్ర సిపిఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. సిపిఐ నాయకులు మహేశ్, స్వామి, కృష్ణ, దుర్గయ్య, వెంకటేశ్, సుదాకర్, సత్యం, ఖాజా, శివశంకర్ పాల్గొన్నారు.