రంగారెడ్డి

అమ్మవారి ఫలహారబండి లాగిన మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జూలై 31: బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సి.లక్ష్మారెడ్డి.. అమ్మవారి ఫలహారబండి లాగి ఊరేగింపును ప్రారంభించారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్‌పర్సన్ రాగం సుజాత ఆధ్వర్యంలో భెల్ ఎంఐజి కాలనీలోని శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద ఆదివారం భారీ ఎత్తున బోనాలు నిర్వహించారు. భెల్ కింగ్ సర్కిల్ వద్ద నుంచి ప్రారంభమైన అమ్మవారి ఫలహారబండి ఊరేగింపులో మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, భారతీనగర్ కార్పొరేటర్ వి.సింధు ఆదర్శరెడ్డి, చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతరెడ్డి, గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబ, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్‌పటేల్, రామచంద్రాపురం కార్పొరేటర్ తొంట అంజయ్య హాజరయ్యారు.
టిఆర్‌ఎస్ నాయకులు మిరియాల రాఘవరావు, జి.మోహన్‌గౌడ్, బద్దం కొండల్‌రెడ్డి, బొల్లంపల్లి సత్యనారాయణరెడ్డి, బచ్చురాజు, బొబ్బ విజయ్‌రెడ్డి, శ్రీనివాస్‌రాజ్, రవింద్రప్రసాద్ దూబే, సునితా ప్రభాకర్‌రెడ్డి, శ్రీకళ, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన హిజ్రాలు మంత్రిని అభ్యర్థించి ఫొటో దిగి తమ సంతోషం వ్యక్తం చేశారు.