రంగారెడ్డి

చేవెళ్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, సెప్టెంబర్ 9: చేవెళ్లను నూతన జిల్లాగా ఏర్పాటు చేస్తూ చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని చేవెళ్ల అఖిలపక్ష నేతలు, ఎంపిపి ఎం.బాల్‌రాజ్, డిసిసి మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామస్వామి, ప్రభులింగం, తెదేపా జిల్లా నాయకుడు శేరి పెంటారెడ్డి డిమాండ్ చేశారు. చేవెళ్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా పోరాట సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన చేవెళ్లను జిల్లాగా ఏర్పాటు చేస్తే అన్ని నియోజకవర్గాలకు సమదూరంలో ఉంటుందన్నారు. చేవెళ్లలో జిల్లా కేంద్రానికి సరిపడ ప్రభుత్వ భూమి ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. జిల్లా ఏర్పాటు విషయంలో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. చేవెళ్లను వికారాబాద్ తప్ప అన్ని నియోజకవర్గల ప్రజలు చేవెళ్ల జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతున్నారని, చేవెళ్ల జిల్లా కోసం కొన్ని రోజుల నుంచి నిరసనలు తెలుపుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. చేవెళ్లను జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి, నాయకులు శివలింగం, మహేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, మధవగౌడ్, శ్రీను, నాగరాజు ఉన్నారు.