భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా -50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయ, సాయంకాల సమయాలలో గుడులకు వెళ్లి దైవదర్శనం, గురుస్వామి దర్శనం చేయాలి!
- కర్మేంద్రియాలు- మాట్లాడే నాలుక, పనులు చేసే చేతులు, నడిపించే కాళ్లు, గుహ్యం (పురుషాంగం), గుదం (విసర్జన అంగం) అనబడే ఐదు కర్మేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని వాటి చేత మంచి ప నులు చేయించడం దీక్షా నియమాల ముఖ్యోద్దేశం!
నాలుక మాట్లాడటానికి సహకరించే కర్మేంద్రియం! అట్లాగే రుచిని తెలిపే జ్ఞానేంద్రియం కూడా!
దీక్షాకలాంలో నాలుకను అదుపులో పెట్టుకోవటం చాలా ముఖ్యం! అందువల్ల మాటల చేత, తినడం చేత జరిగే తప్పులను, పొరబాట్లను అరికట్టడం జరుగుతుంది! కోపాన్ని విడిచి, శాంతంగా వుండాలి!
వాక్కుకు సంబంధించి దీక్షాకాలంలో మితంగా, మృదువుగా మాట్లాడటం అలవర్చుకోవాలి! సత్యం మాట్లాడాలి! సౌమ్యంగా, ఇతరులను సంతోషపెట్టేలా మాట్లాడాలి!
అనవసరపు మాటలు, అబద్ధాలు చెప్పడం, ఇతరులన నొప్పించేలా మాట్లాడటం, వివాదాలు, తగవులు పడటం, ఇతరులను దూషించడం దీక్షాకాలంలో చేయకూడదు!
భగవద్భక్తిని కలిగించే పుస్తకాలు, నీతి బోధకాలైన పుస్తకాలు చదవాలి!
చేతులు మంచి కార్యాలు - దానధర్మాలు చేయడానికి, స్వామి పూజకు ఉపయోగపడాలి! జీవహింస, దొంగతనాలు, ఇతరులను కొట్టడం వంటి పనులు దీక్షాకాలంలో చేయరాదు!
పాదములు- గుడులకు, పుణ్యక్షేత్రాలు దర్శించడానికి కాలినడకన (శక్తినిబట్టి) వెళ్లడం మంచిది! జూదగృహాలు, వేశ్యాగృహాలకు వెళ్లకూడదు!
గుహ్యము సంభోగ సుఖాన్ని ప్రసాదించే పురుషాంగం! దీక్షాకాలంలో బ్రహ్మచర్నాయ్ని విధిగా పాటించాలి! భార్యతో కూడా సుఖించకూడదు! వేశ్యలతో సంపర్కం, బలాత్కరించడం మొదలైన విషయాల గూర్చి ఆలోచించకూడదు! కోరికలను అదుపులో ఉంచుకుని ఆస్ఖలిత బ్రహ్మచర్యాన్ని (స్ర్తి సంబంధిత ఆలోచనలతో వీర్యస్ఞలనమవడం) పాటించడానికి ప్రయత్నిచాలి! మనస్సు విషయవాంఛలవైపు పరిగెత్తకుండా ఉండటానికోసమే సాత్వికాహారం తీసుకోవాలన్న నియమం ఏర్పడింది!
గుదము: ఆహార నియమాలు సక్రమంగా పాటించడంవల్ల విరేచనాలు మలబద్ధకం వంటిరోగాలకు గురికాకుండా శరీరారోగ్యాన్ని కాపాడుకోవచ్చును!
కర్మేంద్రియాలను నిగ్రహించడాన్ని దమము అంటారు.
జ్ఞానేంద్రియాలైన ముక్కు, చెవులు, కళ్లు, నాలుక, చర్మము వీటిని నియత్రించడాన్ని ‘శమము’ అంటారు!
జ్ఞానేంద్రియాల విషయంగా దీక్షాకాలంలో పాటించవలసిన నియమాలు.
1.చెవులు: శబ్దాన్ని గ్రహించే జ్ఞానేంద్రియాలు చెవులు! దీక్షాకాలంలో చెవులను బ్రద్దలు చేసే పెద్ద పెద్ద శబ్దాలను, ఇంద్రియాలను ఉద్రేకపరిచే సంభాషణలను వినగూడదు! మనస్సుకు శాంతిని ప్రసాదించే దైవ సంబంధిత పాటలను, పురాణాలను వినాలి! శాస్ర్తియ సంగీతాన్ని వినడంవల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది;
2.కళ్లు:ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ పరిశీలనాగుణాన్ని అలవరచుకోవాలి! విషాదకరమైన, భయానకమైన, శృంగారపరమైన దృశ్యాలనుర చూడగూడదు! ఎటుచూసినా కళ్లకు స్వామి అయ్యప్ప గోచరించే స్థితికి మనస్సు, కళ్లు చేరుకోవడానికి దీక్షాకాలంలో సాధన చేయాలి!
3.నాలుక:రుచిని తెలియజేసే జ్ఞానేంద్రియం నాలుక! దీక్షాకాలంలో అన్ని రకాల రుచులు కోరుకునే నాలుకను నియంత్రించి సాత్వికాహారాన్ని మాత్రమే భుజించాలి! తీపి, ఉప్పు, పులుపు, కారం, మసాలా దినుసులు లేని ఆహారం తినాలి! అటుకులు, పాలు, పండ్లు స్వీకరించాలి!
4.ముక్కు:వాసనను గ్రహించే జ్ఞానేంద్రియం ముక్కు! దుర్వాసనలు వచ్చే అశున్ర వాతావరణంలో వుండకూడదు మనస్సుకు హాయిని, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పూలతోటలలో తిరగడం, పూజకు పూలు సేకరించడం చేయాలి!
చర్మము:శరీరం అంతర్భాగాలను కప్పివుంచి, స్పర్శజ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానేంద్రియ చర్మం! సౌందర్యం చర్మంవల్లనే కలుగుతుంది శరీరానికి! చల్లని నీటితో రోజూ మూడుసార్లు స్నానం చేయడంవల్ల చర్మం పరిశుభ్రమైన హాయిని ప్రసాదిస్తుంది! చర్మానికి హాని కలిగించే తైలాలు, లేపనాలు వాడకూడదు! నలుగుపిండితో చర్మాన్ని శుభ్రపరచుకోవాలి! అందంగా కనబడటాని ప్రాధాన్యతనివ్వకూడదు! దీక్షాకాలంలో ముఖ క్షవరం, కేశఖండనం (జుత్తు కత్తిరించడం) గోళ్లు తీయడం చేయరాదు! పాదరక్షలు వాడకూడదు!
దీక్షాకాలంలో శవాలను చూడరాదు! బహిష్టు స్ర్తిలను చూడరాదు! పొరబాటున చూస్తే తలస్నానం చేసి, కర్పూరం వెలిగించి, శరణు ఘోషను చేయాలి!
వ్రత దీక్షాకాలంలో దీక్షలో వున్న ఇతరులను ‘స్వామి’ అని, చిన్నపిల్లలను ‘మణికంఠ’ అని, స్ర్తిలను ‘్భగవతి’ అని పిలవాలి! అయ్యప్ప స్వాములు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ముందు మూడుసార్లు ‘స్వామి శరణం’ అని చెప్పుకుని సంభాషణ పూర్తి అయిన తరువాత తిరిగి ‘స్వామి శరణం’ అని మూడుసార్లు చెప్పడం అలవర్చుకోవాలి!

-ఇంకా ఉంది
*

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-డా. టి. కళ్యాణీ సచ్చిదానందం