భక్తి కథలు

బసవ పురాణం 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజ్జలునికి అది తెలిసి దిగ్భ్రాంతి చెంది బాచయ్యకు శరణు చేసి ఆ లింగానికి సోమేశ్వరుడని పేరు పెట్టి సువర్ణ మందిరం కట్టించాడు.
అరియమ కథ
అన్యదైవముల పేరు వినకపోవడం అరియమ అనే భక్తుని నియమం. ఒకానొడక బ్రాహ్మణుడు రుద్రం చదువుతూ వచ్చి అరియమ ఇంటిముందు నిలిచి అన్యదైవనామం ఉచ్ఛరించాడు. అది విని అరియమ బ్రాహ్మణుణ్ణి చంపాడు. రాజుకిది తెలిసి కోపించి ఉరిశిక్ష వేశాడు. అరియమ పోతూ పోతూ దారిలోని శివాలయంలోని శివలింగంలో లీనమైనాడు. అందుకు చిహ్నంగా నేటికీ లింగం నుండి అరియమ కట్టుకున్న మూరెడు వస్త్రం బయటికి వచ్చి మిగిలిపోయింది కనిపిస్తూ ఉంటుంది.
వీర శంకరుని కథ
పరదైవములను చూడననే నియమం కల దీక్షతో వీరశంకరుడనే శివభక్తుడు ఉండేవాడు. ఒకనాడు కలలో బౌద్ధుడొకడు కనిపించగా కలయో? ఇలయో పరమతస్థుడు కనిపించాడని దుఃఖించి వీర శంకరుడు శ్రీశైలం పోయి హాటకేశ్వరుని ముందు మండే పెనంపై కూర్చొని ప్రాణత్యాగం చేసి సాయుజ్యం పొందాడు.
శివలెంక మంచయ్యగారి కథ
శివలెంక మంచయ్య అనే భక్తుడు కాశిలో శివునికి ప్రతిదినమూ తన చేతివేళ్ళు పదీ అర్పించి పూజించి తిరిగి వేళ్ళు పొందేవాడు. ఒకనాడు అన్యమతస్థులు వచ్చి వాదింపగా మంచయ్య గెలిచాడు. మాకు వాదాలు కాదు. దృష్టాంతం చూపించాలి అని వారు కోరగా మంచయ్య రమ్మని పిలువగానే విష్ణువు వచ్చి విశే్వశ్వరునకు ప్రణామం చేశాడు.
కల్లిదేవయ్యగారి కథ
బ్రాహ్మణులొకసారి వాదానికి వస్తే కల్లి దేవయ్య శివుడే పరదైవమని వాదించి ‘‘మీ మీ వేదాలు మా ఇంటి కుక్కలు కూడా చదువుతాయి’’ అని కుక్కతో నాలుగు వేదాలూ చదివించాడు.
బిబ్బ బాచయ్య గారి కథ
గొబ్బూరు అగ్రహారంలో బిబ్బ బాచయ్య అనే శివభక్తుడు ఉండేవాడు. అతడు భక్తుల ప్రసాదం బండ్లకెత్తించి ఆడుతూ పాడుతూ ఆరగింపు చేసేవాడు. ఒకనాడు ప్రసాదపు బండి ఎదురు వస్తుంటే బ్రాహ్మణులు ఆపి ‘అవి ఏమిటి ఎంగిలి కూడు అగ్రహారంలో బండి కదలడానికి వీలులేదు’ అని నిందించారు. బాచయ్య నవ్వాడు. బండిలోని అన్నం అగ్నిగా మారి అగ్రహారం అంటుకుంది. బ్రాహ్మణులు ఏడుస్తూ బాచయ్యకు శరణు చేశారు. బాచయ్య అనుగ్రహించాడు. అగ్ని శాంతించి గృహాలు ఎప్పటివలెనే ఉన్నాయి.
మాదర దూడయ్యగారి కథ
మాదర దూడయ్యగారనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన మజ్జనం చేసిన జలముతో పొర్లితే ఒక బ్రాహ్మణునికి ఎక్కడా నయంకాని కుష్ఠువు నయమైంది.
బాసన భీమయ్య కథ
రోగులైన బ్రాహ్మణులందరికీ శరీరాలు బాగుచేసిన మహాభక్తుడు.
శ్వపచయ్య కథ
శ్వపచయ్య అనే శివభక్తుడు ప్రసాదాన్ని భుజిస్తూ సామవేది అనే బ్రాహ్మణుని కండ్లబడగా మూసివేశాడు. ‘ఓరోరి! మాంసం తింటూ దాచుకున్నావా?’ అని సామవేది నిందింపబోగా ఆయన గుడ్డలు శ్వపచయ్య ముందు పడిపోయాయి. సామవేది శ్వపచయ్యకు మొక్కి శివదీక్ష స్వీకరించాడు.
ఉద్భటుని కథ
బల్లకి అనే పురంలో ఉద్భటుడనే భక్తుడు ఉండేవాడు. ఆయన నగర ప్రభులైన భోజునికి గురువు. ఉద్భటుడు లింగైక్యం చెందగా శరీరాన్ని దహనానికి తీసుకొనిపోయారు. ఆ దహన ధూమం సోకి చెట్టుపైనున్న ఏడువందల భూతాలు విముక్తి చెందాయి.
ఆహారానికి పోయిన ఒక భూతం ఆలస్యంగా వచ్చి ‘అయ్యో! నా గతి ఏమిటి? పనె్నండు వేల సంవత్సరాలనంచి రుూ ఉద్భటుని కోసం ఎదురుచూస్తున్నాము శాపగ్రస్తులమై’ అని దుఃఖిస్తే గంధపు చెక్కలు వేసి నేతిలో గుడ్డలు మంచివేసి మళ్లీ ఉద్భటుని చితిపై పొగను రప్పించగా అది సోకి ఆ భూతం శాపవిముక్తి చెంది మర్రి చెట్టును కూడా పీక్కొని బంధుమిత్ర సహితంగా కైలాసానికి పోయింది.
కక్కయ్య కథ శివనింద చేసిన విప్రుని సంహరించాడు.

- ఇంకా ఉంది

ప్రొ. ముదిగొండ శివ ప్రసాద్