పశ్చిమగోదావరి
చిన వెంకన్న ట్రస్టుకు నామినీ సొమ్ము జమ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 March 2016
ద్వారకతిరుమల, మార్చి 22: ఒక భక్తుడు స్వామి వారి పేరిట వేసిన ఎఫ్డిఆర్ నగదు రూ.32.84 లక్షలు మంగళవారం దేవస్థానంలోని వివిధ పథకాలకు జమయ్యాయి. ఏలూరులోని తంగెళ్లమూడికి చెందిన సిరిపురపు వెంకట సుబ్బారావు అనే భక్తుడు కొంత నగదును బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్చేసి, నామినీగా చిన వెంకన్నను చూపారు. సుబ్బారావు ఇటీవల మృతి చెందడంతో ఆ ఎఫ్డిఆర్లను కుటుంబ సభ్యులు కొద్దిరోజుల క్రితం ఆలయ అధికారులకు అందజేశారు. స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, విమాన గోపుర స్వర్ణమయ పథకానికి రూ.10 లక్షలు, ప్రాణదాన ట్రస్టుకు రూ.4,45,579, గోసంరక్షణ పథకానికి రూ.8,39,332 మొత్తం రూ.32.84,911 జమయ్యాయని ఇఒ వేండ్ర త్రినాథరావు తెలిపారు.