పశ్చిమగోదావరి

కదిలింది జనసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 8: జనసేన పార్టీ అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో మరికొద్దిగంటల్లో నిర్వహించనున్న ఆంధ్రుల ఆత్మగౌరవ సభకు పశ్చిమగోదావరి జిల్లా జనసేన కదిలింది. ముఖ్యంగా ఈ జిల్లాలోని డెల్టాలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు అభిమానులు ఎక్కువ. వీరంతా కూడా తమ అభిమాన నాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ను చూసేందుకు గురువారమే పయనమయ్యారు. రాత్రికే పవన్‌కళ్యాణ్ కాకినాడ చేరుకుంటారన్న సమాచారాన్ని అందుకున్న వీరు ముందస్తుగానే అక్కడకు చేరుకోవాలని ఇక్కడి నుంచి పయనమయ్యారు. ఇప్పటికే జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అలాగే కరపత్రాలను ముద్రించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సభను విజయవంతం చేయాలని కార్యకర్తలు తహతహలాడుతున్నారు. ఇప్పటికే బిజెపి రాష్ట్రానికి తామేమిచ్చిందో ప్రకటించింది తప్పా ఇంకా ఏమిస్తుందో స్పష్టమైన ప్రకటన చేయని నేపథ్యంలో జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఏం కావాలో కాకినాడ సభలో మాట్లాడతారని ఇక్కడి నాయకులు చెబుతున్నారు. అంతేకాదు తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పుకోసం తల ఎత్తి అనే నినాదంతో ఈ సభ సాగుతుందన్నారు. ఇదిలావుండగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. వీరందరూ కూడా జనసేన పార్టీని అభిమానిస్తున్నారు. ముఖ్యంగా ఒడిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కాకినాడ సభకు అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రత్యేకంగా హాజరవుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా నుంచి 1000 మంది కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జెఎన్‌టియు మైదానంలో జరిగే సభ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని బిజెపి నాయకులు గురువారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది.