పశ్చిమగోదావరి

ఉండి నియోజకవర్గంలో పర్యటనకు సిఎం హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, సెప్టెంబర్ 24: త్వరలోనే ఉండి నియోజకవర్గంలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీయచ్చారని ఎమ్మెల్యే శివరామరాజు తెలిపారు. శనివారం ఏలూరు వచ్చిన సిఎంకు బహుళ వినియోగ వాహనాలను ఎమ్మెల్యే శివరామరాజు చూపించారు. కచ్చా డ్రెయిన్‌ల తవ్వకానికి, పుంతరోడ్ల నిర్మాణానికి, మంచినీటి పైపులైన్ వేయడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయని వివరించారు. నియోజకవర్గంలో ఆకివీడు, ఉండి, కాళ్ళ, పాలకోడేరు మండలాలకు నాలుగింటిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఒక్కొక్క వాహనాన్ని రూ.18 లక్షలతో కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఉండిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తాను స్వయంగా పరిశీలించనున్నట్టు సిఎం చంద్రబాబు చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా బహుళ వాహనాలు కొనుగోలు కు సహకరించిన దాతలను సిఎం చంద్రబాబు ఘనంగా సత్కరించారు. చినకాపవరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల శ్రీరామరాజును చంద్రబాబు సత్కరించారు.