పశ్చిమగోదావరి

పౌర సరఫరాల గోడౌన్ వద్ద ఎసిబి తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదవేగి, మే 24 : మండలంలోని వంగూరు సమీపంలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్ వద్ద మంగళవారం ఎసిబి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రైసుమిల్లర్లు, రైతులు బియ్యం దిగుమతి చేసుకోవడానికి గోడౌన్ వద్ద వున్న అధికారులు లంచాలు అడుగుతున్నారనే ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లెక్కలు తేలని లక్షా 36 వేల రూపాయలు నగదు లభించిందని, పౌర సరఫరాల అధికారులు టెక్నికల్ అసిస్టెంట్ శ్రీరామ్, గోడౌన్ ఇన్‌ఛార్జి సత్యనారాయణ, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ నాగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని ఎసిబి డిఎస్‌పి కరణం రాజేంద్ర తెలిపారు. ఆయన వెంట ఎసిబి ఇన్‌స్పెక్టర్ విల్సన్ కూడా వున్నారు. విచారణ జరిపి నివేదిక అందజేస్తామని ఎసిబి అధికారులు వివరించారు.