పశ్చిమగోదావరి

ఘనంగా నవ నిర్మాణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 2: భీమవరం పట్టణంలో నవ నిర్మాణదీక్ష ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు ఈ దీక్ష సాగనుంది. గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి నియోజకవర్గంలో నవనిర్మాణ దీక్షను ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. సిఎం చంద్రబాబుతో పాటు ఎవరి స్థాయిలో వారు కష్టపడితే గ్రామ, పట్టణం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయన్నారు. ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ భీమవరం మున్సిపాల్టీలో రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని వివరించారు. భీమవరం ఎంపిడిఒ వై. పరదేశీకుమార్ నవ నిర్మాణ దీక్ష ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించగా, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ డి. పుష్పమణి, భీమవరం జెఎసి అధ్యక్షుడు కామరాజు, కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావు, టిడిపి సీనియర్ నాయకులు మెంటే పార్థసారధి, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), పట్టణ అధ్యక్షుడు గనిరెడ్డి త్రినాథ్, తోట భోగయ్య, మామిడిశెట్టి ప్రసాద్, చెల్లబోయిన సుబ్బారావు, మున్సిపల్ కౌన్సిలర్లు, భీమవరం మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను తహసీల్దార్ గంధం చెన్నుశేషు ఆధ్వర్యంలో చేశారు.