పశ్చిమగోదావరి

అభివృద్ధి పథంలో నడిపిస్తున్న పిఎం, సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెంటపాడు, జూన్ 2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం పెంటపాడు గాంధీబొమ్మ సెంటర్‌లో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ తెలంగాణా అన్ని వనరులతో తులతూగుతుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకంజలో ఉన్నా ప్రజాహిత కార్యక్రమాలు ఆగలేదన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిద్రావస్థలో ఉంటే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రాజెక్టు పనులు పరిగెడుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తూ దేశాన్ని అవినీతి రహిత ప్రభుత్వంగా నడిపిస్తున్నారన్నారు. జడ్పీ ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు నవ నిర్మాణ దీక్షపై చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వివరించారు. తొలుత ప్రజాప్రతినిధులు, అధికారులు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్ళారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెదపోలు వెంకటేశ్వర్లు, జడ్పీటిసి కిలపర్తి వెంకట్రావు, డిసిసిబి డైరెక్టర్ దాసరి అప్పన్న, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.