పశ్చిమగోదావరి
విజయవాడ - రాజమండ్రి డిఎంయు రైలు ఏర్పాటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 24 June 2016
ఏలూరు, జూన్ 23 : కృష్ణా పుష్కరాల నేపధ్యంలో విజయవాడ నుంచి రాజమండ్రి వరకు డి ఎంయు రైలును గురువారం నుంచి ఏర్పాటు చేసినట్లు ఏలూరు రైల్వేస్టేషన్ స్టేషన్ మాస్టర్ ఎవి సత్యనారాయణరావు తెలిపారు. ఈ రైలు (నెం. 07280) విజయవాడలో ఉదయం 10 గంటలకు బయలుదేరి ఏలూరు 11.15 గంటలకు వస్తుందని, రాజమండ్రి మధ్యాహ్నం 2.10 గంటలకు వెళుతుందని చెప్పారు. తిరిగి అదే రైలు (నెం.07279) సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి ఏలూరు 6.30 గంటలకు చేరుకుని విజయవాడకు 8.05 గంటలకు చేరుతుందని చెప్పారు. ఆగస్టు 9వ తేదీ వరకు ఈ రైలు రాకపోకలు సాగిస్తుందని, బుధవారం రోజు మాత్రం ఈ రైలు రాకపోకలు వుండవని సత్యనారాయణరావు స్పష్టం చేశారు.