పశ్చిమగోదావరి

ట్రాక్ పటిష్ఠానికి బ్యాలెస్ట్ వాల్స్ నిర్మిస్తున్న రైల్వేశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 22: విజయవాడ - గుడివాడ - నిడదవోలు రైలుమార్గంలోని భీమవరం వద్ద ట్రాక్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని రైల్వేశాఖ గుర్తించింది. సర్కార్ ఎక్స్‌ప్రెస్, శేషాద్రి, నరసాపూర్, విశాఖ, నాగర్‌సోల్ వంటి వేగంగా వెళ్ళే ఎక్స్‌ప్రెస్ రైళ్లవల్ల కొన్ని మలుపుల్లో నేల అదరడంతో పాటు ఇప్పటివరకు ఉన్న రాళ్లు కూడా కిందికి జారిపోతుండటంతో అక్కడ పరిస్థితి మెరుగ్గా లేదని రైల్వే అధికారులు గుర్తించారు. దీంతో వేండ్ర రైల్వేస్టేషన్ దాటిన తరువాత 107/3 కిలోమీటర్ వద్ద, టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలో బ్యాలెస్ట్ వాల్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ పనులు త్వరలోనే పూర్తిచేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.