పశ్చిమగోదావరి

భక్తులకు అసౌకర్యం కలగనివ్వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూలై 30: గత సంవత్సరం జరిగిన ఆది పుష్కరాల్లో విధులు నిర్వర్తించినట్లే అంత్య పుష్కరాల్లో కూడా అదే విధంగా విధులు నిర్వర్తించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని ఆర్డీవో ఎస్ లవన్న అన్నారు. ఆదివారం నుండి నిర్వహించబోయే అంత్య పుష్కరాల సందర్భంగా శనివారం సాయంత్రం మండలంలో ఉన్న ఘాట్లను డిఎస్పీ జె వెంకట్రావు, డిఎల్పీవో కె అమ్మాజీతో కలిసి ఆర్డీవో పరిశీలించారు. పట్టిసం రేవులో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన సిబ్బందితో ఆర్డీవో మాట్లాడుతూ అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. విధుల్లో అలసత్వం వహించవద్దని హితవు పలికారు. ఒకవేళ విధులకు హాజరుకాని పక్షంలో ముందుగా తెలియపర్చాలని కోరారు. మండలంలో ప్రభుత్వం గుర్తించిన మూడు ఘాట్లతోపాటు కలెక్టర్ ఆదేశాల మేరకు మిగిలిన 19 ఘాట్లను శుభ్రం చేసినట్లు తెలిపారు. ఘాట్ల వద్ద పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించాలని డిఎల్పీవో అమ్మాజీని కోరారు. డిఎస్పీ వెంకట్రావు మాట్లాడుతూ విపత్కర పరిస్థితులు ఏర్పడితే భక్తులను గోదావరి నది దాటించేది లేదన్నారు. అంత్య పుష్కరాల్లో విధులు నిర్వర్తిందుకు ఇద్దరు సిఐలు, ఏడుగురు ఎస్సైలు, సుమారు వంద మంది కానిస్టేబుల్స్ ఘాట్ల వద్ద రెండు షిఫ్ట్‌లలో విధులు నిర్వహిస్తారని తెలిపారు. తహసీల్దార్ ఎం ముక్కంటి, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ జ్యోతిర్మయి, సిఐ కె బాలరాజు, బోటు సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్, దేవస్థానం ఇవో విశ్వనాధరాజు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇ అజయ్‌బాబు, తదితర సిబ్బంది ఉన్నారు.
ఏర్పాట్లు పూర్తి
మండలంలో అంత్య పుష్కరాల సందర్భంగా ఘాట్ల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన ఘాట్ అయిన పట్టిసంలో బారికేడ్ల నిర్మాణంతోపాటు స్నానాలు చేసే చోట ఐరన్ మెస్‌లు ఏర్పాటుచేశారు. అలాగే భక్తులకు రక్షణగా 8 పడవలను రేవులో ఉంచారు. అలాగే పోలవరంలో మూడు, గూటాలలో రెండు పడవలను సిద్ధంగా ఉంచారు. వీరేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లే భక్తులను గోదావరి నది దాటించేందుకు రెండు లాంచీలను సిద్ధం చేశారు. మండలంలోని 22 ఘాట్ల వద్ద అగ్నిమాపక సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని శుభ్రం చేశారు. పట్టిసం రేవు ప్రారంభంలో ఉన్న ఆర్చిని మామిడి తోరణాలు, పూలతో దేవాదాయ శాఖ అలంకరించనుంది. ఆదివారం ఉదయం పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు గోదావరి నదికి పూజలు నిర్వహించి తొలి స్నానం చేస్తారని అధికారులు ప్రకటించారు.
రుద్రంకోటలో వసతులు కరవు
వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలోని ఏకైక పుష్కర ఘాట్ అయిన రుద్రంకోటలో కనీస వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. అంత్య పుష్కరాలకు ఏకైక ఘాట్‌గా రుద్రంకోటను ఎంపిక చేసి, భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా చూడాలని సబ్‌లెక్టర్ షాన్‌మోహన్ ముందుగానే సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం విదితమే. అయినప్పటికీ ఆదివారం ప్రారంభం కానున్న అంత్య పుష్కరాలకు పుష్కర ఘాట్‌లో కనీసం స్నానాలు గదులు, ప్రమాదాలు జరగకుండా పడవలు ఏర్పాటు చేయడంతోబాటు గజఈతగాళ్లను నియమించాల్సిన అధికారులు పట్టించుకోలేదు. సబ్‌కలెక్టర్ ఆదేశించిన రోజే తూతూ మంత్రంగా చెత్తా చెదారం మెట్ల వద్ద తొలగించి, అదే మెట్లను ఫైరింజన్ ద్వారా శుభ్రపరిచి వెళ్లిపోయారు. తదుపరి ఏర్పాటు చేయాల్సిన స్నానాలగదులు, పడవల విషయం పట్టించుకోలేదు. గ్రామ పంచాయతీ వారు వారి వద్ద గల ఒక తాడును మాత్రం మొక్కుబడిగా కట్టారు. ఈ విషయంపై ఎంపిడిఒ రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా ఒక్క ఆర్‌ఐను ఘాట్‌కు అధికారిగా నియమించినట్టు చెప్పారు. ఏర్పాట్లుకు సంబంధించి ఆదేశాలు తమకు అందలేదన్నారు.

అనధికార తూములపై రైతుల ఆందోళన
మొగల్తూరు, జూలై 30: మొగల్తూరు అడవిపర్ర ఆయకట్టు వ్యవసాయ భూముల్లో శనివారం అనధికార తూములు ఏర్పాటు చేయడం పట్ల ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రైతులు విలేకరులకు తెలిపిన వివరాలిలా వున్నాయి. మొగల్తూరు శివారు అడవిపర్ర ఆయకట్టు వ్యవసాయ భూములకు చెందిన తూరలు సంబంధిత అధికారుల అనుమతితో దర్భరేవు డ్రెయిన్‌లోకి నాలుగు తూరలు మాత్రమే వుండేవి. అయితే కొంతమంది స్వార్థం కోసం శనివారం ఉదయం 15 తూములు దర్భరేవు డ్రెయిన్‌లోకి ఏర్పాటుచేశారు. దీంతో ఆయకట్టుకు చెందిన సుమారు 200 ఎకరాల వ్యసాయ భూముల్లో సాగుకు ఉప్పునీరు తగులుతోంది. దీనివల్ల పంట నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై శనివారం అధికారులకు ఫిర్యాదు చేశారు. అనధికార తూరలు ఏర్పాటుచేసినవారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని అడవిపర్రు ఆయకట్టు రైతులు హెచ్చరించారు. ఆయకట్టు రైతులు లక్కు సత్యనారాయణ, పోతురాజు చింతయ్య, లక్కు లక్ష్మణరావు, వి.సత్యనారాయణ, ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు.