S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అహితేజ బెల్లంకొండ, సురేష్వర్మలు కలిసి నిర్మిస్తున్న అక్షర చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖులు, ఆత్మీయుల మధ్య ఆహ్లాదంగా ప్రారంభమైంది. ఎక్కడికిపోతావు చిన్నవాడ ఫేమ్ నందితశే్వత ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత దిల్రాజు క్లాప్నివ్వగా రఘురామకృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి సుధీర్వర్మ దర్శకత్వం వహించారు.
నేను శైలజతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి తొలి మొదటి సినిమాతోనే ఆడియన్స్ మనసు గెలుచుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. తరువాత నేను లోకల్ చిత్రంతో మరింత చేరువైంది. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనతో అభిమానులు, ఫ్యామిలీ ప్రేక్షకులు, విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంది.
టాలీవుడ్లో చిన్న చిత్రాల నిర్మాణం పెరగడంతో అవకాశాల కోసం బ్యూటీలంతా పరిశ్రమపై దృష్టి పెడుతున్నారు. అయనా తెలుగమ్మాయలకు అవకాశాలు రావడం లేదన్న వాదనను కొట్టిపారేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది వౌర్యాని. జానకిరాముడు, అర్థనారి చిత్రాల్లో ఆకట్టుకున్న తెలుగమ్మాయ మరిన్ని కొత్త చిత్రాల్లో తన టాలెంట్ చూపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
పద్మనాయక ప్రొడక్షన్స్పై కల్వకుంట్ల నాగేశ్వరరావు కథను అందిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఉద్యమ సింహం. నటరాజన్ (కరాటే రాజా) కేసీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. సూర్య, పి.ఆర్.విఠల్బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు. దిలీప్బండారి సంగీతం. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. కరాటే రాజా, నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సీడీని ఆవిష్కరించారు.
నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. నిడివి చాలా తక్కువ ఉన్న పాత్రల్లో కూడా భారీ తారాగణం నటిస్తోంది.
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాదిలో ఉంటుందదన్నది చాలా రోజులుగా హల్చల్ చేస్తున్న న్యూస్. బాలయ్య ఎన్నో కథలను విన్నాడని కొన్నింటిని సెలక్ట్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంటుందనుకున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఏడాది ముగుస్తున్నా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ చిత్రంతో బిజీగా ఉన్నారు.
సూపర్స్టార్ మహేష్బాబు నటిస్తున్న ‘మహర్షి’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈమధ్యే అమెరికాలో షెడ్యూల్ పూర్తి చేసిన టీమ్, కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్కు తిరిగొచ్చింది. వచ్చిన తర్వాత బ్రేక్ తీసుకోకుండా అన్నపూర్ణా స్టూడియోస్లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ మొదలెట్టింది.
ఎన్టీఆర్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన టెంపర్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలైన చాలా ఏళ్ల తర్వాత హిందీలో రణ్వీర్సింగ్ హీరోగా సింబా పేరుతోనూ, తమిళంలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతోనూ తెరకెక్కడం విశేషం. తమిళ రీమేక్కు ఎఆర్ మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకుడు. విశాల్ కోసం దర్శకుడు ఒక పవర్ఫుల్ మాస్ ఐటెం నెంబర్ ప్లాన్ చేశాడట.
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృతాసింగ్ కూతురు సారా అలీఖాన్ తాజా వ్యాఖ్యలు సినీవర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. కేదార్నాథ్ చిత్రంతో బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్కు ఎంట్రీ ఇస్తున్న సారా, తొలి చిత్రంలోనే లిప్లాక్లతో రెచ్చిపోయింది. చిత్రం ట్రైలర్లో హీరో సుషాత్ సింగ్ రాజ్పుత్తో సారా చేసిన లిప్లాక్ సీన్లు కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్నాయి.
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కవచం’. డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇటీవల విడదలైన టీజర్కి 9 మిలియన్ వ్యూస్ స్పందన రావడం, సినిమాపై అంచనాలు పెరిగాయి. థ్రిల్లర్ కానె్సప్ట్తో వస్తున్న చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్నాడు. మెహ్రీన్ మరో కథానాయికగా నటిస్తుండగా, హర్షవర్థన్ రాణే,