S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న చలో’ చిత్రంలోని రెండవ పాటను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బి.ఏ రాజు, పసుపులేటి రామారావు, సీనియర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
పాత తరం హాస్యనటుడు పొట్టి వీరయ్య ఆర్థిక ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న నటుడు చిరంజీవి ఆయనకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు శివాజీరాజా ఆధ్వర్యంలో సోమవారం చిరంజీవి ఇంటికి పొట్టి వీరయ్య స్వయంగా వెళ్లి ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన ఆరోగ్యం ప్రస్తుతం సరిగా లేదని, చిరంజీవి కొండంత అండ మరువలేనిదని పొట్టి వీరయ్య తెలిపారు.
దక్షిణాది స్టార్ కథానాయికల రేసులోముందు వరుసలోనే ఉంది రకుల్ ప్రీత్సింగ్. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. తెలుగులో మూడు, తమిళంలో రెండు భారీ ప్రాజెక్టులు ప్రస్తుతం ఆమె చేతిలో వున్నాయి. అలాగే మహేష్బాబు సినిమా చర్చల దశలో వుంది. నాలుగేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ విరామం లేకుండా వుంది.
రాజ్తరుణ్ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై శ్రీరంజని దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రంగులరాట్నం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రాశుక్లా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సితార, ప్రియదర్శి తదితరులు నటించారు.
కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్బాబు ఒక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సెట్స్పైకి వెళ్లనున్నారు. ఊపిరి తర్వాత వంశీ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
సుధీర్బాబు, అతిథిరావుహైదరీ జంటగా శ్రీదేవి మూవీస్ పతాకంపై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ రూపొందించిన చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. డిసెంబర్ 11 నుంచి 23 వరకు హైదరాబాద్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. మరో షెడ్యూలు జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నది. పేరు నిర్ణయించని ఈ చిత్ర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
కింగ్ ఫిషర్ క్యాలెండర్ నుంచి బాలీవుడ్.. అటునుంచి టాలీవుడ్కు వచ్చిన దిశాపటానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. తెలుగులో ఆమె నటించిన లోఫర్ చిత్రం సరైన ఫలితం ఇవ్వకపోవడంతో బాలీవుడ్లోనే మకాం వేసింది. బ్లాక్బస్టర్ హిట్ ఆమె ఖాతాలో లేకపోయినా, అవకాశాలు వస్తూనే వున్నాయి. ఇక మార్షల్ ఆర్ట్స్ హీరో టైగర్ష్రాప్తో ప్రేమాయణం నడుపుతూ నిత్యం వార్తల్లో వుండేందుకు ప్రయత్నిస్తోంది ఆమె.
చలనచిత్ర రంగ పరిశ్రమలో కొడుకులనే కాక కుమార్తెలను సైతం నటనకు వారసత్వంగా, దర్శకత్వానికి, గాయకులుగా వారసత్వంగా కొత్తదనాన్ని ఆహ్వానిస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్య, మామగారు, బ్రహ్మ వంటి అనేక చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలను సైతం పోషించింది. ఇంకా నటిస్తూనే వుంది.
అందాల బొమ్మ అను ఇమ్మాన్యుయేల్ పేరు ఇప్పుడు టాలీవుడ్లో జోరు జోరుగా వినిపిస్తోంది. అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోలతో చిత్రాలు చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకెళుతోంది. తాజాగా పవర్స్టార్ పవన్కళ్యాణ్కు జోడీగా ‘అజ్ఞాతవాసి’లో నటిస్తూనే, మరో పక్క ఎన్టిఆర్, నాగ చైతన్య, రామ్ చరణ్ చిత్రాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంది. కొత్త సంవత్సరం 2018లో ఆమె నటించిన చిత్రాలు వరుసగా సం దడి చేయబోతున్నాయి.
సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా పూర్తిచేస్తోంది సీరత్కపూర్. రాజుగారి గది-2 చిత్రంలో నాగార్జున సరసన నటించి మంచి అవకాశాలు పట్టేస్తుంది. అల్లు శిరీష్ నటించిన ఒక్క క్షణం చిత్రంలో ఆమె పాత్ర హైలెట్గా వుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రవితేజ టచ్చేసి చూడు చిత్రంలో ఆమె క్యారెక్టర్ ఎలా వుంటుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.