S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇప్పటికే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పదేళ్ళయింది. మరో పదేళ్ళపాటు హీరోయిన్గా కొనసాగుతా అని తెగ కాన్ఫిడెంట్గా చెబుతుంది తెలుగు భామ అంజలి. పుట్టింది ఆంధ్రాలో అయినా తమిళ జనాలను తెగ ఇంప్రెస్ చేసిన ఈ తెలుగు పాప నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న అంజలి సీనియర్ హీరోలతోపాటు యువ హీరోలతో నటించింది.
‘2 కంట్రీస్’ కథ తీసుకున్నాక పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చిం ది. కానీ సునీల్తోనే చేస్తేనే బావుంటుందన్నారు. కానీ ఆయనకు మార్కెట్ లేదు. వేరే నిర్మాతను కలిస్తే, అమెరికాలో ఎందుకు బ్యాంకాక్లో చేద్దామన్నారు. అది నాకు నచ్చలేదు. అందుకే నేనే నిర్మాతగా మారాను అంటున్నారు దర్శకుడు ఎన్.శంకర్.
1977లో ‘పెళ్లిపందిరి’ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్గా సక్సెస్సాధిచిన దిల్రాజు.. 2002లో ‘దిల్’ చిత్రంతో నిర్మాతగా సక్సెస్ను సాధించాడు. ఒక పక్క నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా రాణిస్తున్న దిల్రాజు 2017లో తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఆరు విజయవంతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించి డబుల్ హ్యాట్రిక్ నిర్మాత అయ్యాడు.
కష్టాల వలయాలలో చిక్కుకుని ఆర్తిగా ఎదురుచూస్తున్న ఆపన్నులన ఆదుకుంటూ ఎదుగుతోంది మనం సైతం ఛారిటీ సంస్థ. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్కుమార్, సినీ నటులు రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్, సురేష్, సన, చిల్లర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ప్రియాంకా చోప్రా. బాలీవుడ్తోపాటు హాలీవుడ్లో కూడా సత్తా చాటిన ఈ భామతో సినిమాలు చేసేందుకు అటు బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. ఈ అమ్మడి అందానికి దాసోహం అవ్వని రసిక ప్రియుడు ఉండరు. ఇప్పటికే అటు నటిగా, ఇటు గ్లామర్ భామగా ఇమేజ్ తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా.. ఇకపై డాక్టర్ ప్రియాంకా చోప్రా మారింది.
విలక్షణ నటుడు డా.మోహన్బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్ర ఫస్ట్లుక్ విడుదలైంది. క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్లుక్లో మోహన్బాబు పవర్ఫుల్ లుక్ విశేషంగా ఆకట్టుకోగా, పోస్టర్ ఉన్న కాప్షన్ ‘ఆ రోజు రాముడు చేసింది తప్పే అయితే.. నాదీ తప్పే’ మరింత ఆసక్తిని రేపుతోంది.
అప్పట్లో హీరోయిన్గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ భూమిక పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. కొంత గ్యాప్ తరుత రీ ఎంట్రీ ఇస్తూ నానితో కలిసి ‘ఎంసిఏ’ సినిమాలో నటించింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలవో భూమిక పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూకట్టాయి. ఇప్పటికే పలు అవకాశాలు వస్తున్నాయట.
లక్ష్మీనరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అల్లు శిరీష్, సురభి, సీరత్కపూర్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన తారాగణంగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి రూపొందించిన చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 28న విడుదలకు సిద్ధమైంది.
అల్లు శిరీష్, సురభి జంటగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ చిత్రం ఈనెల 28న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్లకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో రెండు పార్లాల్ లైఫ్లతో ముడిపడివుండే కథ. ఒకరిది ప్రెజెంట్, మరొకరిది ఫ్యూచర్ అనే తరహాలో సాగుతుంది.