పశ్చిమగోదావరి

పజారోగ్య శాఖ అధికారి బంధువు ఇంట్లో ఎసిబి తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జూన్ 23: ప్రజారోగ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ డి పాండురంగారావుపై విజయవాడలో ఎసిబి అధికారులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఆయన సమీప బంధువు ఇంట్లో కూడ శుక్రవారం ఎసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయన బంధువు పట్టణంలో చంటి పిల్లల వైద్యుడు కావడంతో ఆయన ఆసుపత్రిలో, ఇంట్లో ఏలూరు నుండి వచ్చిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల కారణంగా శుక్రవారం ఆసుపత్రి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికారులు ఎవరినీ లోనికి అనుమతించకుండా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కొంత నగదు, బంగారం లెక్కించారని, విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. వివరాలు వెల్లడించేందుకు అధికారులు వెల్లడించారు.