పశ్చిమగోదావరి

పోటెత్తిన గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జూలై 20: గోదావరి నది వరద పోలవరం వద్ద క్రమేపీ పెరుగుతోంది. పోలవరంలో సీనియర్ సిడబ్ల్యూసి కార్యాలయం వద్ద గోదావరి నీటి మట్టం 11మీటర్లకు పెరిగింది. గోదావరి వరద స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని, అయితే పెద్దగా ప్రమాదంలేదని సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు. వరద పెరగడంతో పోలవరంలోని ఇసుక తినె్నలు మునిగిపోయి, లంకను తాకింది. పట్టిసం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో కొవ్వాడ స్లూయిజ్ వద్దకు వరద నీరు చేరింది. ప్రస్తుతానికి గోదావరి వద్ద 11.5 మీటర్ల వరకూ చేరుకుందని, ఆ తర్వాత మళ్లీ క్రమేపీ తగ్గే అవకాశం ఉందని సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు.